టీడీపి: గెలవడం కోసం కమ్మ సామాజిక వర్గం అంత పని చేశారా..?

Divya
తెలుగుదేశం పార్టీ ఈసారి గెలుస్తామని నమ్మకం ఏమిటంటే.. గతంలో కూడా కమ్మ సామాజిక వర్గం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సహాయం చేస్తూ ఉండేది. ముఖ్యంగా ఫండింగ్ విషయంలో కూడా చాలా సహాయం చేసేవారు.అయితే ఈసారి అలా కాకుండా 1:10 లెక్క వేసుకున్నారు.. ప్రపంచంలో ఏ దేశములో ఉన్న కమ్మ సామాజిక వర్గం వారు బిజినెస్ పరంగా, ఉద్యోగంపరంగా మరే రకమైన పరంగా కూడా వాళ్లందరూ ఒక ఆర్గనైజేషన్ గా ఓటు వేయడానికి వెళ్లారనేది తెలుస్తోంది.

ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా లెక్క వేసుకుంటే.. కోటి మంది వరకు కమ్మ సామాజిక వర్గం వారు ఉన్నారని అంచనా వేసుకుంటున్నారు. ఒక్కొక్కరు కనీసం 10 మందితో మాట్లాడారు.. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే వారితో కానీ.. ఇతర రాష్ట్రాలతో ఉన్నటువంటి వారితో.. పేదలనైనా సరే మధ్యతరగతి కుటుంబాల నైనా సరే.. ఒక్కొక్కరు పదిమందిని టార్గెట్ పెట్టుకొని మాట్లాడడం.. ఆ పదిమందికి కూడా రాష్ట్రం బాగుపడాలంటే ముఖ్యంగా సంక్షేమ పథకాలు మరింత ఎక్కువ రావాలంటే చంద్రబాబు రావాలని.. మధ్యతరగతి ప్రజలైతే మీ పిల్లల జీవితాలు బాగుపడలంటే బాబు రావాలని.. వంటి అంశాలు తెలియజేస్తూ కనెక్ట్ అయ్యేలా చేసుకున్నారట.

ప్రజల అవసరాన్ని బట్టి వారి యొక్క స్థితిని బట్టి అంచనా వేసుకుని వారిని బ్లెంమ్ చేసేలా చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని కూడా డెడ్ లైన్ చేస్తూ కొనసాగారు.. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే మౌత్ పబ్లిసిటీ అని కూడా చెప్పవచ్చు.. ఈ దఫా కమ్మ సామాజిక వర్గం వారి జీవితంలో ప్రాణం పెట్టి మరి ఈ పని చేశారు.. దీంతో పాటు ఇతర పార్టీలలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం వారిని కన్విజ్ చేయడంలో కానీ.. ఇబ్బందులు పడేటువంటి వారిని సెట్ చేయడం కాని జరిగింది. అందుకే అంత కాన్ఫిడెంట్గా ఉన్నట్టు తెలుస్తోంది. డబ్బుకు డబ్బు కూడా ఖర్చు పెట్టారట. ముఖ్యంగా వారి దగ్గరికి వచ్చే వారందరినీ కూడా కన్విన్ చేసి మాట్లాడడంతో వారు గెలుపు ఖాయమని ధీమాతో ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: