విక్టరీ : పాయే.. కేసీఆర్ సొంత జిల్లా కూడా పాయే.. అక్కడ గెలుపు అయనదే?

praveen
మే 13వ తేదీన తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అంత ప్రశాంతంగా మారిపోయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కాబోతున్నాయి. అయితే అంతకుముందే ఏ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయంపై ఇక రాజకీయ నిపుణులు అందరూ కూడా ఒక అంచనాకు వస్తూ ఉన్నారు. అయితే మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయిన మెదక్ లో ఈసారి గులాబీ కంచుకోట బద్దలు కాబోతుంది అని అంచనా వేస్తున్నారు.

 మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన జరిగిన ఎన్నికల్లో ఎక్కువసార్లు అటు కాంగ్రెస్ పార్టీని విజయం సాధించింది. కానీ ఆ తర్వాత 2004 నుంచి కూడా అక్కడ కెసిఆర్ గెలుస్తూ వచ్చారు. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గులాబీ పార్టీకి తిరుగులేకుండా పోయింది. అయితే ఒక రకంగా ఇది కారు పార్టీకి కంచుకుంటలా మారిన పార్లమెంటు నియోజకవర్గం. ఇక్కడి నుంచి దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన ఇందిరా గాంధీ కూడా ఎంపీగా ఎన్నికై ఇక ప్రధాని పదవి చేపట్టారు అని చెప్పాలి.  ఇది కాంగ్రెస్ కి కూడా ప్రతిష్టాత్మకమైన పార్లమెంట్ నియోజకవర్గం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ పరిధిలో పునర్వైభవం సంపాదించేందుకు తీవ్రంగానే శ్రమించింది.

 బిఆర్ఎస్ నుంచి వెంకటరామిరెడ్డి.. బిజెపి నుంచి రఘునందన్ రావు.. కాంగ్రెస్ నుంచి నీలం మధు బరిలోకి దిగారు. అయితే నీలం మధు గెలుపు కోసం ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి ఇంకోవైపు మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో మంచి పట్టున్న మైనంపల్లి హనుమంతరావు ముమ్మర ప్రచారం నిర్వహించారు. అయితే పటాన్చెరులో మంచిపట్టున్న కాటా శ్రీనివాస్ నీలం మధు కలవడం.. ఇంకోవైపు ఇక నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి పార్లమెంటు ఎన్నికల్లో హస్తం పార్టీకి ప్లస్ పాయింట్ గా మారింది. ఇంకోవైపు ఇక సీఎం రేవంత్ రెడ్డి పలు దపాలుగా మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రచారం నిర్వహించడంతో పార్టీ శ్రేణుల్లో  మరింత జోరు పెరిగింది. ఇక మైనంపల్లి హనుమంతరావు ఆయన కొడుకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సైతం కాంగ్రెస్ విజయం లక్ష్యంగా ఎంతో కష్టపడి పని చేశారు. మరోవైపు అటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం హస్తం పార్టీకి ప్లస్ పాయింట్ గా మారింది. ఇంకో వైపు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన నీలం మదుకు అటు బీసీ నేతల నుంచి మంచి సపోర్ట్ ఉండనే ఉంది. ఇలా అన్ని సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని మొదటి నుంచి నీలం మధుదే విజయం అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈసారి మెదక్ లో అటు పోలింగ్ శాతం కూడా పెరిగింది. ఈ పెరిగిన పోలింగ్ శాతం కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిపించబోతున్నట్లు అని తెలుస్తుంది. దీంతో  కేసీఆర్ ఇప్పటికే రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోగా.. ఇప్పుడు సొంత జిల్లాలో కూడా ఓడిపోయి పరువు పోగొట్టుకో బోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: