ఎలక్షన్ 2024: ఓటు వేసేటప్పుడు ఇలాంటి పని చేస్తే జైలుకే..!

Divya
మే 13వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఎన్నికలలో ఓటు వేసేందుకు ప్రజలు కూడా తమ స్వగ్రామానికి సైతం తండోపతండాలుగా వెళుతూ ఉన్నారు.. ముఖ్యంగా బస్టాండులలో, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు కిక్కిరిస్తున్నారు. అలాగే టోల్ ప్లాజా వద్ద కూడా భారీగానే వాహనాలు నిలిచిపోవడంతో కొన్ని గంటలు సమయం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఇలాంటి సమయంలోనే ఓటు వేసేందుకు వెళ్లే  వారికి అధికారులు సైతం పలు రకాల హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఓటు వేసే సమయంలో కొన్ని పనులు చేస్తే జైలుకు వెళ్లడం ఖాయమని అధికారులు సైతం వెల్లడిస్తున్నారు. హైదరాబాద్ వంటి ప్రాంతాలలో ఈరోజు నుంచే కఠినమైన ఆంక్షలు కూడా విధిస్తున్నారు. మరి ఓటు వేసే సమయంలో కొన్ని నియమాలను ఉల్లంఘించకూడదు వాటి గురించి తెలుసుకుందాం.
1). పోలింగ్ బూత్ వద్ద కచ్చితంగా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. దీంతో అక్కడ ఎవరూ కూడా ఎలాంటి ప్రచారం, అల్లర్లు వంటివి సృష్టించకూడదు.

2). అలాగే పోలింగ్ బూత్ లోకి కెమెరాలు మొబైల్స్ వంటివి అసలు తీసుకొని వెళ్లకూడదట. ముఖ్యంగా ఎన్నికల అధికారకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదు.

3). ఎవరైనా మద్యం తాగి పోలింగ్ బూతు వద్దకు వెళితే కేసు ఫైల్ అవుతుందట .ఓటు వేయడానికి వెళ్లేటప్పుడు గుర్తింపు కార్డుని వెంట తీసుకొని వెళ్ళాలి.. ముఖ్యంగా ఇతరుల ఓటు వేయడానికి అసలు ఎవరు ప్రయత్నించకూడదు. ఇలాంటివి చేస్తే చాలా కఠిన శిక్షలు ఉంటాయట.

4). ఓటర్లు సైతం పోలింగ్ బూతులోకి మొబైల్స్ నాట్ అలౌడ్.. ఓటు వేసేటప్పుడు ఫోటోలు తీయకూడదు ఏ పార్టీకి వేసాయో అసలు బయటికి చెప్పకూడదు. ఓటు హక్కు వినియోగించుకున్న వెంటనే పోలింగ్ బూత్ నుంచి బయటికి వచ్చేసేయాలి. ఓటుకి నోట్లు తీసుకోవడం కూడా చాలా నేరమే.
ఓటర్ల జాబితాలో పేరు ఉన్న వ్యక్తి మాత్రమే ఓటు వేయాలి. దొంగ ఓట్లు వేయడం చెట్టారీత్యా నేరం. ఒకే వ్యక్తి రెండు ఓట్లను కూడా వేయడం నేరమే. పోలింగ్ రోజున ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల నిబంధనలను పాటించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: