రాయలసీమ (హిందూపురం) : బాలయ్య గెలుపుకి గండి కొడుతున్న స్వామి..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమిగా బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు అన్నీ ఏకమై ఈసారి బరిలోకి దిగబోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీని ఢీకొట్టాలనే తపనతో చంద్రబాబు పక్క ప్రణాళికలతోనే ముందుకు వెళుతున్నారు. అంతేకాకుండా అభ్యర్థులను కూడా ప్రకటించడం విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారు. అవసరమైనచోట్ల కూడా అభ్యర్థులను మారుస్తూ ముందుకు వెళుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా తిరుగుతూ సూపర్ సిక్స్ హామీలను అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటూ కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ పాలన వైఫల్యాలను కూడా తమ అభ్యర్థులతో చెప్పి ప్రజలలో ఉండేలా చూస్తున్నారు.

కానీ కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబుకు చాలా తలనొప్పులుగా మారుతున్నాయి. ముఖ్యంగా సీట్ల విషయంలో అభ్యర్థుల విషయంలో ఎక్కడో ఒకచోట ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. బాలకృష్ణ నిలబడిన హిందూపురం నియోజవర్గంలోని  పార్లమెంటు సీటు విషయంపై ఇప్పటికి తలనొప్పిగానే మారుతోందట. ముఖ్యంగా అక్కడ పరిపూర్ణానంద స్వామి సీటు కావాలని పట్టుబడుతున్నారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో బిజెపిలోకి చేరిన ఈ పరిపూర్ణానంద స్వామి పొత్తులో భాగంగా తనకు హిందూపురం టికెట్ దక్కుతుందని చాలా నమ్మకంతో ఉండేవారు.

అయితే అక్కడ కేవలం రెండు సీట్లు కూడా టిడిపికే దక్కాయి. ఎంపీ టికెట్ టిడిపి అభ్యర్థి బి కే పార్థసారధికి రాగా.. అవసరమైతే ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే గా కూడా పోటీ చేయడానికి సిద్ధమవుతానని చంద్రబాబుని హెచ్చరించారట... అయితే అభ్యర్థుల మార్పులు చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న పరిపూర్ణానంద స్వామి ఇటీవల చంద్రబాబును కూడా కలిశారట. అయితే ఆయన టిడిపిలోకి చేరుతానని చాలా వార్తలు కూడా వినిపించాయి. కానీ ఎంపీ టికెట్ అయితే తనకు ఇవ్వాలని లేకపోతే కచ్చితంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చంద్రబాబుకు సవాల్ విసిరారు పరిపూర్ణానంద స్వామి.. దీంతో టీడీపీలో ఒక్కసారిగా కలవరం మొదలయ్యింది. అయితే అక్కడ హిందూపురంలో పరిపూర్ణానంద స్వామి కి బాగా పాపులారిటీ ఉందని కచ్చితంగా అక్కడ ఓట్లు చిలే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నదట. దీన్ని బట్టి చూస్తే కచ్చితంగా అక్కడ బాలయ్య మెజారిటీతో గండిపడేలా కనిపిస్తోందట... మరి ఎలాగైనా బిజెపి నేతలతో మాట్లాడి స్వామిని చంద్రబాబు ఒప్పించగలరేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: