ప్రచారంలో పనికొచ్చే టాపిక్ మాట్లాడని జగనోరు?

Purushottham Vinay
ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎన్నికల ప్రచారంలో కీలకమైన అంశాల గురించి అస్సలు మాట్లాడకపోవడం అందర్నీ షాక్ కి గురిచేస్తోంది.గతంలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు తమ పదవులకు రిజైన్ చేశారు. అది వైసీపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే అందుకోసం ఏకంగా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసేశారు. పైగా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నినదించారు.ఇప్పుడసలు ప్రత్యేక హోదా అంశం గురించే మాట్లాడటంలేదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తన హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయన్న విషయాన్ని కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.సొంత జిల్లా అయిన కడపలో నిర్మించ తలపెట్టిన కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెదవి విప్పలేకపోవడం పట్ల ఏకంగా వైసీపీ శ్రేణులే ఆశ్చర్యపోతున్నాయి.


బస్సు యాత్ర చివరి దశకు వచ్చేసింది. ఇడుపుల పాయ నుంచి మొదలైన బస్సు యాత్ర, ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చేసరికి పూర్తిగా సల్లబడిపోయింది.కృష్ణా, గుంటూరు జిల్లాలో తేలిపోయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సు యాత్ర, చివరికి తుస్సు యాత్రగా మిగిలిపోయేలాగా ఉంది. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ మీద వున్న ధ్యాస, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడటంపై లేకపోవడం ఏంటని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా పాడిన పాటే పాడుతున్నారు వైఎస్ జగన్. రెండున్నర లక్షల కోట్ల రూపాయల్ని నేరుగా లబ్దిదారులకు సంక్షేమ పథకాల రూపంలో అందించామన్నది వైఎస్ జగన్ పదే పదే ఊదరగొడుతున్నారు.అసలు అధికారంలో ఎవరు వున్నా, కూడా సంక్షేమం కొనసాగుతుంది. ఈ విషయంలో ఓటర్లకు కూడా ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి.కానీ, అభివృద్ధి అనేది చాలా కీలకం. పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి చాలా అవసరం. ఇలాంటి విషయాలపై వైఎస్ జగన్ ఎందుకు స్పందించట్లేదో అన్నది ప్రశ్న..ఇక నుంచైన పనికొచ్చే అంశాలు గురించి జగనోరు మాట్లాడతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: