శ్రీకాకుళం : టీడీపీకి భారీ షాక్ ఇచ్చిన 'గుండా' దంపతులు.!
అయితే అలాంటి వారికీ ప్రస్తుతం జిల్లాలో వారి పరిస్థితి అయోమయంలో పడిందనే చెప్పాలి. వారికీ పార్టీ కీలక నేతైనా అచ్చెన్నాయుడుతో తీవ్ర విభేదాలున్నాయి.అచ్చెన్నాయుడు జిల్లాలో తమని అణచి వేస్తున్నారంటూ,తమకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని గుండా దంపతుల వర్గం ఆరోపించింది. గుండ వర్గం ఆరోపిస్తోంది.అయితే
గుండ లక్ష్మీదేవిని పక్కన పెట్టి గొండు శంకర్కు చంద్రబాబు టికెట్ కేటాయించారని దీనికి కారణం కూడా అచ్చెన్నాయుడు అని గుండా వర్గం ఆరోపిస్తోంది.ఇటీవల చంద్రబాబును కలిసిన గుండా దంపతులు ఒక అనూహ్య నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.అయితే వారికీ టికెట్ విషయంపై చంద్రబాబు క్లియర్ గా చెప్పేశారు.ప్రస్తుతం ఉన్న సమీకరణాన్ని బట్టి శ్రీకాకుళం అభ్యర్థిని మార్చే ప్రసక్తి లేదని, టీడీపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించేందుకు పనిచేయాలని ఆ దంపతులకు చంద్రబాబు చెప్పారట.చంద్రబాబు నిర్ణయంపై అసంతృప్తితో ఉన్న దంపతులు తాము క్రియశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు అని వారి వర్గం ప్రకటించింది.అయితే వారి నిర్ణయం అనేది ప్రస్తుతం ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే వారి నిర్ణయం అనేది రాబోయే ఎన్నికల్లో టీడీపీ పార్టీపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.