ఖమ్మం : కన్ఫ్యూషన్ లో కాంగ్రెస్.. మరి క్లారిటీ వచ్చేదెప్పుడు?
అయితే కాంగ్రెస్ కంచుకోటగా పిలుచుకునే ఖమ్మంలో ఇక ఎంతో సులభంగా గెలిచే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇక కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీని ఇక్కడ బరిలోకి దింపాలని అనుకున్నారు. కానీ సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లారు ఆ తర్వాత కనీసం అటు ప్రియాంక గాంధీతో అయిన ఇక్కడి నుంచి పోటీ చేయించాలి అనుకున్నారు. కానీ ఆమె పోటీ చేస్తారా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ఒకవేళ వాళ్ళు ఖమ్మం నుంచి పోటీ చేయకపోతే.. ఇక టికెట్ తమకే రావాలి అంటూ మరి కొంతమంది పార్టీలోని కీలక నేతలు పట్టుపట్టారు ఇప్పటివరకు ఖమ్మం అభ్యర్థి వీరే అంటూ డజన్కు పైగా పేర్లు వినిపించాయ్. ఇక ఇప్పుడు మండవ వెంకటేశ్వరరావు పేరు కూడా వినిపిస్తోంది.
మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉంటే ముగ్గురు తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం అర్జున భర్జన తర్వాత ఇలా మంత్రుల కుటుంబ సభ్యులకు ఛాన్స్ వచ్చే అవకాశం లేదని తేలింది. అయితే ఒక మాజీ మంత్రి అల్లుడు దగ్గరనుంచి బీసీ నేతల వరకు చాలామంది పేర్లను అధిష్టానం పరిశీలించిందట. చివరికి మొన్న టిడిపిని వదిలి కాంగ్రెస్ లో చేరిన నందమూరి సుహాసిని పేరు కూడా తెరమీదకి వచ్చింది ఇక ఇటీవల నిజాంబాద్ జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వరరావు పేరు కూడా తెరమీదికి రావడం గమనార్హం.