మల్కాజ్గిరి : ఆమె డమ్మీ అభ్యర్థా.. కేటీఆర్ ఇలా అనేసాడేంటి?

praveen
గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తప్పకుండా హ్యాట్రిక్ సాధిస్తాం అనుకున్న బీఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పలేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు నిలబడటంతో ఆ పార్టీ ఘనవిజయాన్ని సాధించి అధికారాన్ని చేపట్టింది. మూడోసారి అధికారాన్ని చేపట్టాలి అనుకున్న బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తుంది  ఇప్పటికే పార్టీలోని కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరుకుంటున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ విపత్కర పరిస్థితుల్లో ఎదుర్కొంటుంది.

 ఇలాంటి సమయంలో పార్లమెంట్ ఎన్నికల్లో తప్పక విజయం సాధించి పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని గులాబీ దళపతి కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అయితే మినీ ఇండియా గా పిలుచుకునే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంఫై బీఆర్ఎస్ ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. 38 లక్షల ఓటర్లు ఉండే ఈ నియోజకవర్గంలో భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని బరిలోకి దింపింది.  ఇక ఇదే పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి తరఫున ఈటల రాజేందర్ కాంగ్రెస్ తరపున సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

 అయితే లోకల్ నాన్ లోకల్ అనే నినాదాలు తెరమీదకి తెచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇక ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు  ప్రయత్నిస్తుంది. అయితే ఇటీవలే  మల్కాజ్గిరి లో అటు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఏకంగా మిగతా పార్టీల అభ్యర్థులపై విమర్శలు చేశారు. మల్కాజ్గిరి లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది అంటూ కామెంట్ చేశాడు కేటీఆర్   లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతే ఈటెల రాజేందర్ హుజూరాబాద్ కి సునీత మహేందర్ రెడ్డి తాండూర్ కు వెళ్తారని.. ఇలాంటి నాన్ లోకల్ నాయకులు మనకు అవసరమా అంటూ వ్యాఖ్యానించాడు  ఇక్కడే ఉంటూ మన అభివృద్ధి కోసం పాటుపడే పక్కా లోకల్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని గెలిపించుకుందాం అంటూ పిలుపునిచ్చాడు. అయితే సీఎం రేవంత్ సిట్టింగ్ ఎంపి స్థానంగా ఉన్న మల్కాజ్గిరి లో కాంగ్రెస్ డమ్మీ.. అభ్యర్థిని నిలబెట్టింది అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక అసలు అర్థమేంటి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: