చివరకు జనసేనానికి టీడీపీ నేతలే దిక్కయ్యారుగా?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయితే కూటమిలో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలు దక్కడంతో జనసైన నేతలు, కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పవన్ తీరుపై మండిపడుతున్నారు. ఇక ఈ సమయంలో పవర్ స్టార్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.ఇక జనసేన పార్టీ పెండింగ్ లో ఉన్న రెండు స్థానాలకు టీడీపీ నేతలే దిక్కయ్యారు. వారికే అభ్యర్థిత్వాలు కన్ఫామ్ చేయడం లాంచనమే అనుకోవచ్చు. అవనిగడ్డ నియోజవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మండలి బుద్దప్రసాద్‌ జనసేన పార్టీలో చేరారు. అవనిగడ్డ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీకి వస్తే ఆయనే అభ్యర్థి. ఆయన బలమైన నేత కావడం వల్ల జనసేన పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆయననే పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నిజానికి అధికార పార్టీ వైసీపీ కూడా మండలి బుద్దప్రసాద్ కు ఆఫర్ ఇచ్చింది. కానీ ఆయన చేరలేదు. దీంతో చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఫిక్స్ చేశారు. 



పాలకొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నేత నిమ్మక జయకృష్ణ కూడా జనసేన పార్టీలో చేరారు. ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వ రేసులో ముందున్నారు. కానీ సీటు జనసేన పార్టీ ఖాతాలో చేరింది. దీంతో ఆయన కూడా జనసేన పార్టీలో చేరి…కూటమి అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. జనసేన పార్టీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు. పిఠాపురంలో వీరు తమ అనుచరులతో కలిసి పార్టీలో చేరడం జరిగింది. రెండు నియోజకవర్గాల్లో జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేసినా కూడా వీరికే అధికారికంగా అభ్యర్థిత్వం ప్రకటించనున్నారు. వీరిద్దరితో జనసేన పార్టీ లిస్ట్ కూడా పూర్తవుతుంది. విశాఖ దక్షిణం నంచి వంశీకృష్ణ యాదవ్‌కే పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. ఏది ఏమైనా జనసేన పార్టీ కోసం పని చేసిన వారికి టికెట్లు ఇవ్వకుండా టీడీపీ నేతలకు టికెట్లు ఇవ్వడం పట్ల జనసేన ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విమర్శకులు చివరకు జనసేనానికి టీడీపీ నేతలే దిక్కయ్యారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: