నాడు తండ్రికి.. నేడు కొడుకు కి వెన్నుపోటు పొడిచిన టీడీపీ

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీని ఓడించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు పోరాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్ర మంలో క డ ప పార్ల మెంట్ అభ్యర్ధిగా బలమైన నేతను బలిపీఠం ఎక్కించేందుకు టీడీపీ తంటాలు పడింది. అభ్యర్థి ఎంపిక వివిధ మార్గాల్లో జరిగింది. ఐవీఆర్ఎస్ రెగ్యులర్ ఫోన్ సర్వేలు నిర్వహించి రోజురోజుకు పేర్లను బయటకు తీసుకొచ్చింది.

ఎట్టకేలకు జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి భూపేష్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అసెంబ్లీ టిక్కెట్టు ఆశించిన భూపేష్‌ను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం వెనుక కుట్ర దాగి ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎవరైనప్పటికీ ఓడిపోయే అవకాశం ఉన్న ఈ సీటుకు భూపేష్ ను ఎంపిక చేయడం వెనుక ఆదినారాయణరెడ్డి తెరవెనుక వ్యూహం పన్నినట్లు విశ్వసనీయ సమాచారం.

కడప మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నుంచి ప్రతిసారీ ఎదురుదెబ్బ తగులుతోంది. క్షేత్రస్థాయిలో కష్టపడి చివరకు ఫలితాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఆదికి అలవాటుగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై నారాయణరెడ్డి కుటుంబం పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. తండ్రి చంద్రబాబు, తనయుడు లోకేష్‌ భూపేష్‌రెడ్డి ఇద్దరూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తన సన్నిహితుల సూచన మేరకే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు భూపేష్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని పసిగట్టిన ఆది అండ్ కో.. పార్లమెంటరీ అభ్యర్థులుగా తెరపైకి తెచ్చారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జమ్మలమడుగులో వర్గ రాజకీయాలకు క్యాడర్‌ను కాపాడుకునేందుకు నారాయణరెడ్డి తనయుడు భూపేష్‌రెడ్డితో కలిసి టీడీపీలో యాక్టివ్‌గా మారారు. రాజకీయంగా నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు నారాయణరెడ్డి చురుగ్గా పనిచేస్తున్నారు. దేవగుడి కుటుంబం (ఆదినారాయణరెడ్డి మినహా) భూపేష్ రాజకీయ ఎదుగుదలకు కృషి చేస్తోంది. ప్ర‌స్తుతం టీడీపీ టికెట్ వ‌స్తుంద‌ని అనుకుంటున్నారు.
క్యాడర్‌ను సిద్ధం చేసుకునేందుకు తాము ఎంతగానో శ్రమించిన తరుణంలో ఆదినారాయణరెడ్డికి ఎమ్మెల్యే సీటు దక్కిందన్న ధీమాతో  భూపేష్‌కి కోడి పందేలు కొట్టినట్లుగా మిగిలింది. బ్లాక్ మెయిల్ రాజకీయాలతో తండ్రి సీటును గెలిపించిన ఆది.. ఈరోజు రాజకీయ మంత్రంతోనే కొడుకు సీటు కూడా సంపాదించుకొని భూపేష్ కు వెన్నుపోటు పొడిచాడు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: