రాయలసీమ : "మేమంతా సిద్ధం" బస్సు యాత్ర 4వ రోజు షెడ్యూల్ ఇదే...!

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం అన్ని పార్టీలు మంచి జోరుమీదున్నాయి. ఒకవైపు వైసీపీ, మరోవైపు కూటమి పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మేమంతా సిద్ధం అంటూ సీఎం జగన్ బస్సుయాత్రతో దూకుడు పెంచారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా చుట్టూ తిరుగుతున్నారు. మూడో రోజు కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో బస్సుయాత్ర చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ.. వైసీపీ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు.  
వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర భాగంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉదయం 9 గంటలకు పత్తికొండలోని రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరనున్నారు. ఆయన రాతన మీదుగా తుగ్గలి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు గ్రామస్థులతో ముఖముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం జొన్నగిరి,  గుత్తి మీదుగా  ప్రయాణించి గుత్తి శివారులో భోజనవిరామం తీసుకుంటారు. సాయంత్రం 3 గంటలకు బయలుదేరి  పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్ , ఆకుతోటపల్లి , సంజీవపురం శివారు వరకు బస్ యాత్ర కొనసాగుతుంది. సంజీవపురం శివారులో  రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
నిన్న ఎమ్మిగనూరు సభలో ప్రసంగించిన సీఎం జగన్.. మేలు చేసిన ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కోరారు. ప్రతిపక్షాల ఎత్తులు, చాకచక్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక.. రెండు అంశాలకు సంబంధించి ఎమ్మిగనూరు సభ వేదికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శింగనమల వైసీపీ అభ్యర్థి విషయంలో చంద్రబాబు చేస్తున్న విమర్శలకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పాలన వల్ల డిగ్రీలు చదివిన వారు టిప్పర్ డ్రైవర్లుగా, ఉపాధి హామీ కూలీలుగా మారితే వైసీపీ టిక్కెట్లు ఇచ్చి చేరదీశారన్నారు.
కాగా, నేడు కర్నూలు జిల్లా రతనాల నుంచి సీఎం జగన్‌ బస్సుయాత్ర ప్రారంభమై అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. జగన్ రతనాల నుంచి తుగ్గలి చేరుకుని ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం గరిగెట్ల క్రాస్, జొన్నగిరి, బసినేపల్లి, గుత్తి, పామిడి, గార్లదిన్నె, రాప్తాడు, ఇటిక్యాలపల్లి మీదుగా కృష్ణంరెడ్డిపల్లికి చేరుకుని రాత్రికి సీఎం జగన్ బస చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: