గోదావరి: రెబల్ ఎంపీగా టిక్కెట్ రాని బీజేపీ నేత...!
అయితే చంద్రబాబు వీరిని కాదని నాన్ లోకల్ అయిన కడప జిల్లాకు చెందిన పుట్టా మహేష్ యాదవ్కు సీటు కేటాయించారు. అయితే ఇదే సీటును బీజేపీ నుంచి సీనియర్ నేత, ఆర్ ఎస్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న గారపాటి తనప చౌదరి.. తపన చౌదరి కూడా ఆశించారు. అయితే ఇప్పుడు ఆయన ఈ సీటు దక్కక పోవడంతో తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. సీటు రాకపోవడంతో తపన చౌదరి పొత్తు ధర్మం వదిలేసి మరీ తాను పోటీ చేస్తానని చెపుతున్నారు.
తపన చౌదరి గత 15 ఏళ్లుగా ఏలూరు పార్లమెంటు సీటు పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఆయన ఎన్నో సేవా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సారి ఏలూరు పార్లమెంటకు పోటీ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా హిందూత్వ నినాదంతో బాగా పాపులర్ అయిన తపన చౌదరికి పార్టీలు, కులాలు, మతాలతో సంబంధం లేకుండా ఆయనకు మంచి పేరు ఉంది.
ఇక ఇప్పుడు తపన చౌదరి ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా టీడీపీ క్యాండెట్ కు దెబ్బ పడిపోతుందని.. చాలా ఊళ్లల్లోనూ, పట్టణాల్లోనూ ఓట్లు చీలిపోతాయని అంటున్నారు. మరి తపన చౌదరి పొత్తు ధర్మం పాటిస్తారా ? లేదా ఇండి పెండెంట్ గా అయినా పోటీ లో ఉంటారా ? అన్నది చూడాలి .