గోదావరి: టిక్కెట్లు లేని నేతలకు ఆయిట్మెంట్ పూసిన బాబు.. ఏం చేశాడో చూడండి..!
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కొవ్వూరు సీటు ఆశించి భంగపడ్డారు మాజీ మంత్రి కేఎస్. జవహర్. ఆయన ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన ఒకానొక దశ లో కొవ్వూరులో పార్టీ సీనియర్ నేత అచ్చిబాబు పై తీవ్ర స్ధాయిలో విరుచుకు పడ్డారు. పార్టీ మారతారని కూడా ప్రచారం జరిగింది. చంద్రబాబు జవహర్ కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు.
ఇక మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం రామచంద్రాపురం సీటు ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు ఆయనకు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఛాన్స్ ఇచ్చారు. ఇక పెందుర్తి లేదా విశాఖ నగరంలో ఏదొ ఒక సీటు ఆశించారు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ. ఆయనకు పొత్తుల్లో జనసేనకు సీట్లు వెళ్లి పోవడంతో నిరాశే మిగిలింది. దీంతో గండి బాబ్జీ ని విశాఖ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడి గా నియమించారు.
హిందూపురం పార్లమెంటు పార్టీ అధ్యక్షుడి గా బివి. రాముడు, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శులుగా సీఎం రమేష్ తో పాటు మన్ను సుబ్బారెడ్డి లను నియమించారు.