చేతులెత్తి మొక్కుతాం.. న్యాయం చేయండి?

Chakravarthi Kalyan
హైకోర్టు తీర్పు ఆదేశానుసారంగా  గవర్నర్ కోటాలో తిరిగి తమనే నామినేట్ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు దాసోజ్ శ్రావణ్, కుర్రా సత్యనారాయణ సోమవారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో రాజకీయాల్లోకి వచ్చామన్న దాసోజ్ శ్రావణ్, కుర్రా సత్యనారాయణ... అందువల్ల చేతులెత్తి మిమ్మల్సి మొక్కుతున్నామన్నారు. కిందిస్థాయి నుంచి తమకు ఎంఎల్ సీలుగా అవకాశం కల్పించాలని గవర్నర్ తమిళసైను దాసోజ్ శ్రావణ్, కుర్రా సత్యనారాయణ కోరారు.
 
అనంతరం రాజ్ భవన్ వద్ద వారు మీడియాతో వారు మాట్లాడారు. గవర్నర్ కోటా ఎంఎల్‌సీలుగా దాసోజ్ శ్రావణ్, కుర్రా సత్యనారాయణ గత జూలై 31వ తేదీన అప్పటి  క్యాబినెట్  సమావేశంలో  కేసీఆర్ దాసోజ్ శ్రావణ్, కుర్రా సత్యనారాయణ అవకాశం కల్పిస్తూ  తీర్మానం చేశారు. దీనిపై 55 రోజుల తర్వాత గవర్నర్ దాసోజ్ శ్రావణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో రాజ్యాంగ ఉల్లాఘన జరిగింది అని దాసోజ్ శ్రావణ్, కుర్రా సత్యనారాయణ  కోర్టును ఆశ్రయించారు.  

తదనంతరం అసెంబ్లీ ఎన్నికలు రావడం....రాష్ట్రంలో కొత్త  ప్రభుత్వం  ఏర్పడడంతో గవర్నర్ కోటలో   అమీర్ అలీ ఖాన్,  కోదండ రాం ల పేర్ల తో గజిట్ బయటి వచ్చింది. దీనిపై తాము వేసిన పిటీషన్ పై  హైకోర్టు స్పందించి రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లు  అభిప్రాయం వ్యక్తం చేసిందని దాసోజ్ శ్రావణ్, కుర్రా సత్యనారాయణ  అన్నారు. దీంతో కొందండ రాం, అమీర్ అలీ ఖాన్ ల నియామకాని బ్రేక్ పడిందని దాసోజ్ శ్రావణ్, కుర్రా సత్యనారాయణ  అన్నారు. అయితే వారికి తాము వ్యతిరేకంగా కాదని..  కేవలం పేద కులానికి చెందిన వాళ్ళం కనుక మాకు న్యాయం చేయండనే గవర్నర్ ను కోరుతున్నామని దాసోజ్ శ్రావణ్, కుర్రా సత్యనారాయణ అన్నారు. పైగా తాము ముందు వరుసలో ఉన్నామని, కాబట్టి మాకు ఎంఎల్ సీలుగా అవకాశమివ్వాలని దాసోజ్ శ్రావణ్, కుర్రా సత్యనారాయణ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. మరి వీరి విజ్ఞప్తిని గవర్నర్‌ ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: