చంద్రబాబుకు అండ అంటూ తన ఉనికిని కోల్పోతున్న పవన్..!!

Divya
2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హఠావో దేశ్ బచావో అన్న నినాదంతో పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు.అయితే ఆ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సపోర్టు చేశారు పవన్ కళ్యాణ్.. ప్రశ్నించడం కోసమే తన పార్టీ పెట్టాను అంటూ తెలుపుతున్న పవన్ తన మద్దతుతో ఏర్పడ్డ ప్రభుత్వాన్ని పరిష్కరించకుండా కేవలం ప్రతిపక్షాలను మాత్రమే ప్రశ్నిస్తూ ఉంటారు.. ఆ తర్వాత 2019 ఎన్నికలలో తాను గెలవాలని టార్గెట్ కంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని గెలవకూడదని ఆలోచనతోనే ఎక్కువగా ప్రయత్నించారు.


2019 ఎన్నికల తర్వాత మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరి ప్రస్తుతం 2024 ఎన్నికల కోసం అటు టిడిపి , బిజెపి మధ్య పొత్తుకుదిర్చే బాధ్యత తన భుజాన మీద వేసుకొని ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన ను టిడిపి టీముగా మార్చేసుకున్నారు పవన్ కళ్యాణ్.. పార్టీ పెట్టి ఇప్పటికి పదేళ్లు అవుతున్న ఎన్నికల కోసం సొంతంగా ఎలాంటి రోడ్డు మ్యాప్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు పవన్ కళ్యాణ్.. టిడిపి చూపించిన దారిలోనే నడవడమే జనసైనికుల వంతు అంటూ తమకంటూ ఎలాంటి సొంత జెండా లేకుండా పోయింది అంటూ పలువురు కార్యకర్తలు తెలుపుతున్నారు.

స్కిల్స్ కామ్ లో చంద్రబాబును అరెస్టు చేయగా ఏపీలో ఏర్పడ్డ పొలిటికల్ తనకు అనుకూలంగా మార్చుకోలేకపోయిన పవన్ కళ్యాణ్.. స్వయంగా టిడిపి తో పొత్తు ప్రకటించి మరి మరొకసారి జనసైనికులను నిరాశపరిచారు.. అయితే రాకరాక వచ్చిన అవకాశాన్ని పవన్ కళ్యాణ్ వదులుకున్నారు.. ఒకవేళ పవన్ కళ్యాణ్ టిడిపికి మద్దతు తెలపకుండా ఉంటే బీజేపీతో కలిసి ముందుకు వెళ్లి ఉంటే 2024లో ఏదైనా జరిగి ఉండవచ్చు.. కానీ అలా చేయకపోవడంతో ఇప్పుడు జగన్ కింగ్ మేకర్ గా మారారు. ప్రస్తుతం చంద్రబాబుకు అండ అనే భ్రమలో పవన్ కళ్యాణ్ తన ఉనికిని కోల్పోతున్నారని వార్తలు జనసైనికుల నుంచి వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: