ఇక దేశావ్యాప్తంగా సిగ్గు చేటుగా మారిన మణిపూర్ అంశంపై నేడు పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం అనేది నెలకొంది. ఈ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు ఫుల్ గా డిమాండ్ చేయగా కేంద్రం కూడా అందుకు సమ్మతించింది.రూల్ నెంబర్ 267 కింద మణిపూర్ అంశాన్ని చర్చించాలని ప్రతిపక్షాలు కోరగా.. కేంద్రం మాత్రం రూల్ నెంబర్ 176 కింద చర్చిస్తామని క్లారిటీ ఇచ్చింది.మణిపూర్ అంశంపై అరగంట చర్చ సరిపోదని, రూల్ 267 కింద చర్చ జరపాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గట్టిగా డిమాండ్ చేశారు.కేంద్రం ఇందుకు అంగీకరించడం లేదని ఆయన ఆరోపించారు.అయితే.. ప్రతిపక్షాలు మాత్రం పదే పదే తమ నిర్ణయాన్ని మారుస్తున్నాయని కేంద్రం మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. కేవలం ప్రధాని మోదీ వచ్చి ప్రకటన ఇవ్వాలని కోరుతున్నాయని ఆయన చెప్పారు. అయితే మణిపూర్ అంశంపై చర్చించే ఆసక్తి ప్రతిపక్షాలకు లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. అయితే అసలు ఈ రూల్ నెంబర్ 176, 267 రెండు నిబంధనల మధ్య ఉన్న తేడా ఏంటంటే..
రాజ్య సభ నిబంధనల ప్రకారం రూల్ 267కు ప్రత్యేక వెసులుబాటు అనేది ఉంటుంది. ఇక దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మీద ప్రత్యేకంగా చర్చ జరపాలని సభ్యులు కోరవచ్చు. ఇందుకు ఆ రోజు సభలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ఇతర సభ్యులు ఇచ్చిన నోటీసులనేవి తాత్కాలికంగా రద్దు చేయాలని కోరుబడతాయి. ప్రత్యేక చర్చకు సభ్యుడు కనుక నోటీసు ఇస్తే.. దాన్ని స్పీకర్ అనుమతించాల్సి ఉంటుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాన్ని రాతపూర్వకంగా కానీ లేదా ఓరల్గానీ ఇవ్వాల్సి ఉంటుంది.ఈ చర్చలో సభ్యులు ఏ అంశంపైనైనా కూడా అడగవచ్చు.1990 నుంచి 2016 దాకా కేవలం 11 సార్లు మాత్రమే ఈ రూల్ కింద చర్చ జరిగింది.
ఇక రూల్ 176 ప్రకారం.. చర్చ కేవలం అరగంట నుంచి రెండున్నర గంటలపాటు మాత్రమే ఉంటుంది. సభలోని ప్రతి సభ్యుడు కూడా ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశంపై చర్చించేందుకు నోటీసు ఇస్తున్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్కు లేఖని రాయాల్సి ఉంటుంది. ఇక ఆ నోటీసుకు మద్దతు తెలుపుతూ ఇద్దరు సభ్యులు సంతకాలు చేయాలి.ఈ నోటీసు ఇచ్చిన కొద్ది గంటల వ్యవధిలో లేదా మరుసటి రోజు స్పీకర్ దాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు.