మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే రూ.7 లక్షలు పొందవచ్చు..

Satvika
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు వరుస గుడ్ న్యూస్ లను వింటూన్నారు.ఇప్పటికే ఎన్నో స్కీమ్ ల ద్వారా ఆదాయాన్ని పెంచుకున్నారు.ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.ఈపీఎఫ్‌ ఖాతా కలిగిన ప్రతి ఒక్క ఉద్యోగికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్వహించే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ (ఈడీఎల్‌ఐ) స్కీమ్‌కు అర్హులు.అంటే కేవలం ఈ అకౌంట్ ఉంటే చాలు ఈ స్కీమ్ కు అర్హులు అవుతారు.

అసలు ఈడీఎల్ఐ స్కీమ్ అంటే ఏమిటి? ఈ స్కీమ్ గురించి తెలిసినవారు తక్కువే మంది ఉంటారు. ఇదొక బీమా పథకం. అంటే ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ ఈపీఎఫ్ఓ అందించే బీమా ప్రయోజనం. ఇటీవల ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌లో కొన్ని సవరణలు చేసింది ఈపీఎఫ్ఓ. ఎక్కువ మంది పీఎఫ్ ఖాతాదారులకు ఈ ఇన్స్యూరెన్స్ లాభాలు అందించేందుకు ఈపీఎఫ్ఓ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు..

ఇకపోతే ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ చనిపోవడానికి ముందు 12 నెలల కాలంలో ఒకటి కన్నా ఎక్కువ సంస్థల్లో పనిచేసి సర్వీసులో మరణించినట్లయితే వారి కుటుంబ సభ్యులకు కూడా బీమా ప్రయోజనం కల్పించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఈ స్కీమ్ ద్వారా రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఉచితంగా బీమా పొందే అవకాశం దక్కుతుంది. ఈపీఎఫ్ ఖాతాదారులు సర్వీసులో ఉండగా మరణిస్తే నామినీకి ఈ బీమా మొత్తం డబ్బులు అందుతాయి..

ఈడీఎల్ఐ స్కీమ్ నెలకు బేసిక్ సాలరీ రూ.15,000 లోపు ఉన్న వారందరికీ వర్తిస్తుంది. బేసిక్ సాలరీ రూ.15,000 దాటితే గరిష్టంగా రూ.7 లక్షల వరకే బీమా ఉంటుంది. ఈడీఎల్ఐ స్కీమ్‌లో చేరడానికి ఉద్యోగులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎంప్లాయర్ మాత్రం బేసిక్ సాలరీలో 0.5% లేదా గరిష్టంగా రూ.75 ప్రతీ నెల చెల్లించాలి. ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్ సర్వీసులో చనిపోతే నామినీ ఈ బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్, ఫామ్ 5 ఐఎఫ్, నామినీ అకౌంట్‌కు చెందిన క్యాన్సల్డ్ చెక్ కావాల్సి ఉంటుంది...ఈ అకౌంట్ గురించి మరింత సమాచారం కావాలంటే మాత్రం దగ్గరలోని ఈపీఎఫ్‌వో కార్యాలయంలో సంప్రదించాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: