కోలీవుడ్లో కుర్రహీరోయిన్ల కంటే వారికే ఎక్కువ క్రేజ్.. వారెవరో తెలుసా..?

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంతో మంది కుర్ర హీరోయిన్లు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తున్నారు. వారిలో కొంత మంది కొన్ని విజయాలను అందుకొని మంచి స్థాయికి వెళ్లినా కూడా ఓ ఇద్దరు హీరోయిన్ల స్థాయికి మాత్రం అస్సలు వెళ్లడం లేదు. వారిద్దరూ మరెవరో కాదు త్రిష , నయనతార. వీరు కెరీర్ ను మొదలు పెట్టి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతుంది. కెరియర్ మొదలు పెట్టిన తర్వాత చాలా తక్కువ కాలంలోనే వీరికి తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన అవకాశాలు రావడం మొదలు అయ్యాయి. అలాగే వీరు నటించిన సినిమాలు మంచి విజయాలను అందుకోవడం , వీరు తమ నటనతో , అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో విరు చాలా తక్కువ కాలంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లారు.

వీరు తమిళ ఇండస్ట్రీ లో వరుస సినిమాల్లో నటిస్తున్న సమయం లోనే తెలుగు సినిమాలలో కూడా నటించారు. ఆ తెలుగు సినిమాలు కూడా చాలా వరకు విజయాలు సాధించడంతో ఈ ఇద్దరు ముద్దు గుమ్మలు తెలుగు సినీ పరిశ్రమలో కూడా స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లారు. ఇక మళ్ళీ ఆ తర్వాత వీరిద్దరూ టాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ తగ్గించి కేవలం తమిళ సినీ పరిశ్రమ పైనే ఇంట్రెస్ట్ ను చూపించడం మొదలు పెట్టారు. ఇకపోతే ప్రస్తుతం వీరిద్దరూ వీరి వయసు కంటే తక్కువ వయసు ఉన్న హీరోలతో కూడా ఆడిపాడి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

అలాగే కమర్షియల్ సినిమాలలో అందాలు ఆరబోయడం మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమాలలో వైవిద్యమైన సినిమాలలో నటిస్తూ తమ నటనతో కూడా ప్రేక్షకులను ఆలరిస్తున్నారు. ఇక వీరిద్దరూ కోలీవుడ్ ఇండస్ట్రీ లోనే అత్యధిక రెమ్యూనిరేషన్ ను తీసుకుంటున్న నటీమణులుగా కూడా కెరియర్ నీ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎంత మంది కొత్త హీరోయిన్ లు తమిళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వీరిద్దరి క్రేజ్ కి దగ్గరగా మాత్రం ఎవరు రాలేకపోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: