ఇక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం వచ్చే ఏడాదిలోపు రైతుల రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించడం జరిగింది.ఇక బుధవారం రోజు నాడు వనపర్తి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహా జనసభకు ఆయన హాజరయ్యారు. ఇక ఆ మహా సభలో ఆయన ఈ విధంగా మాట్లాడటం జరిగింది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు ఇంకా అలాగే రైతు బీమా వంటి పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇక అంతేకాదు ఎరువులు ఇంకా అలాగే విత్తనాలు సరైన కాలంలో అందజేసి, 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడం వల్ల రైతులు మంచి లాభాలు గడిస్తున్నారని మంత్రి వెల్లడించడం జరిగింది. అలాగే రైతులు ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదగాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని కూడా ఆయన తెలిపారు.
ఇక ఈ కారణం వలన రైతులు అప్పులు చేసే పరిస్థితులు తగ్గిపోయాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటి వరకు కూడా రూ.36 వేలలోపు ఉన్న రుణమాఫీ పూర్తయిందని ఆయన అన్నారు. రూ.36 నుంచి 75వేలలోపు ఉన్న రుణాల మాఫీ ఈ సంవత్సరం ఖచ్చితంగా పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చే సంవత్సరం లోపు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని మంత్రి తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తడం వల్ల రుణమాఫీ కొంత ఆలస్యం జరిగిందని మంత్రి తెలిపారు. అలాగే రైతులు ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను సద్వినియోగ పరచుకుని డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసి మంచి లాభాలు గడించాలని ఆయన సూచించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ఇంకా అలాగే అధికారులు పాల్గొన్నారు.