హై కోర్ట్ తీర్పు: ఏపీ ప్రభుత్వంపై చెలరేగిన చంద్రబాబు...

VAMSI
ఏపీ లో జగన్ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతోంది. అయితే విపక్షాలు తీరు ఎలా ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం తన యొక్క పాలనతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎన్ని విమర్శలు తనపై వస్తున్నా లెక్క చేయక ప్రజలకు చెప్పిన మాట లాగే నవరత్నాలు అమలు చేస్తూ వచ్చాడు. అందుకే నేటికీ ప్రజల్లో జగన్ కు అంతటి గౌరవం ఉంది. అయితే నేడు హై కోర్ట్ మూడు రాజధానులు మరియు అమరావతి రాజధాని పై వేసిన పిటీషన్ కు విచారణ జరిపించి తీర్పును ఇచ్చింది. అయితే ఈ తీర్పు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకమముగా ఉండడంతో ఉదయం నుండి రాష్ట్రము అంతటా దీని గురించే చర్చ జరుగుతోంది. విపక్షాలు అన్నీ కూడా ఈ తీర్పును అడ్డం పెట్టుకుని జగన్ ను మరియు ఏపీ ప్రభుత్వాన్ని దారుణంగా విమర్శిస్తున్నారు.

కాగా తాజాగా మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు సైతం ఈ విషయంపై ఘాటు వ్యాఖ్యలు చేసారు. అయన మాట్లాడుతూ హై కోర్ట్ తీర్పును టీడీపీ స్వాగతిస్తోంది అన్నారు. టీడీపీ ప్రభుత్వం రాజధానిగా నిర్ణయించిన అమరావతిపై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు మరువలేనివని ఈ సందర్భంగా అయన గుర్తు చేశారు. అమరావతిని రాజధానిగా ఉండకుండా చూడడానికి ఎన్నోకుట్రలు చేశారని, ఈ రాజధానిని కాపాడుకోవడం కోసం అమాయకపు రైతులు 800 రోజులకు పైగా దీక్ష చేస్తూనే ఉన్నారని వారి బాధను గుర్తు చేశారు. ఈ రోజు హై కోర్ట్ ఇచ్చిన తీర్పుతో అమరావతి కోసం పోరాడిన ప్రతి ఒక్క రైతు గెలిచాడని వారి శ్రమను గుర్తించారు.

ఏపీ ప్రభుత్వం అమరావతిని గతంలో ఎడారిగా చూపించే ప్రయత్నాలు చేశారన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం చేసిన ఎన్నో డొంకతిరుగుడు కార్యకలాపాలు రైతులు ధైర్యమైన దీక్ష ముందు నిలవలేదని చంద్రబాబు వారిని పొగిడారు. ఇది నిజంగా అమరావతి రైతుల విజయంగా అభివర్ణించారు. ఇక ఏపీ ప్రభుత్వం తమ ప్రయత్నాలు అన్నీ విరమింపచేసుకుని అమరావతిని రాజధానిగా ఒప్పుకోవాలని చురకలు అంటించారు. ఈ తీర్పు ముఖ్యంగా జగన్ నిర్ణయాలకు ఆలోచన విధానాలకు చెంప పెట్టు అన్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: