ఉద్యోగుల స్థానికతకు పెను ప్రమాదం..! ఎందుకంటే..?
ఇప్పటికే ప్రమోషన్లు దక్కకుండా.. ఇతర సమస్యలతో సతమతమవుతున్న తరుణంలోనే ఉద్యోగులను మరింత ఇబ్బంది పెట్టేవిధంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు బండి. ముఖ్యంగా రాష్ట్రంలో పాత సమస్యలను దారి మళ్లించేందుకు ఎప్పటికప్పుడూ కొత్త సమస్యలను తెరమీదకు తీసుకొస్తూ రాజకీయంగా పబ్బం గడుపుకోవడం సీఎం కు అలవాటుగా మారిందని బండి సంజయ్ చెప్పారు.
ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయలను కమీషన్లుగా దండుకున్నారు సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. ఆ డబ్బుతో ఉద్యోగుల సమస్యలను దాచి పెట్టి.. తనకు అవసరమైనప్పుడే వాటిని బయటకు తీస్తూ రాజకీయ డ్రామాలు ఆడుతూ.. గందరగోళం సృష్టిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళ సృష్టిస్తున్న ఆ జీవో అమలును తక్షణమే నిలిపివేయాలని.. ఆ తరువాతనే జిల్లాల వారిగా ఉద్యోగుల కేటాయింపు చేపట్టాలన్నారు. అదేవిధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల స్పూర్తిని కూడా దెబ్బతీయకుండా నిర్ణయం తీసుకోవాలని బండి సంజయ్ సూచించారు.