హైదరా బాద్ పట్టణం లోని చందానగర్ పోలీస్ స్టేషన్ ప రిధి లో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి కి పెద్దలు నిరాకరించారనీ ఆత్మ హత్య యత్నం చేసింది ఓ పెళ్లి జంట.ఈ సంఘటన లో ప్రియురాలు మృతి చెందగా... ప్రియుడు ఆస్పత్రి చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటన నిన్న రాత్రి చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. . ఒంగోలు కు చెందిన నాగ చైతన్య , కోటి రెడ్డి ఇద్దరూ గత కొన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు.
హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో నర్స్ గా పని చేస్తు న్నారు నాగ చైతన్య. అటు మెడికల్ రె ప్రజెంటే టివ్ గా పని చేస్తు న్నారు కోటి రెడ్డి. అయితే.... వీరి ఇద్దరి కులాలు వేరు కావడం తో పెళ్లికి నిరా కరించారు పెద్దలు. దీంతో చేసేది ఏమి లేక... హైదరాబాద్ లోని చందా నగర్ లో లాడ్జ్ తీసుకుంది ఈ ప్రేమ జంట. ఈ నేపథ్యం లోనే ప్రియరాలిని హత్య చేశారు కోటి రెడ్డి.
హత్య చేసిన అనంతరం లాడ్జ్ నుండి అదృశ్యమయ్యాడు కోటి రెడ్డి. కట్ చేస్తే ఒంగోలు లో ప్రత్యే కమైన కో టి రెడ్డి... ఒంటి నిండా గాయాలతో ఒంగోలు లో హాస్పిటల్ లో చేరాడు. దీంతో చందా నగర్ లో కేస్ నమోదు చేశారు పోలీసులు. ఒంగోలు లో చికిత్స పొందు తున్న కోటి రెడ్డి నీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తమ పెళ్లి కి పెద్దలు అంగీకరించలేదని ఇద్దరు చని పోవా లని నిర్ణయం తీ సు కున్నట్టు పోలీసులకు చెబుతున్నాడు కోటి రెడ్డి. అయితే.. దీని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తు న్నారు.