భారత్లో ఫస్ట్ `ఎలక్ట్రిక్ హైవే` ఎక్కడంటే..?
ఈ నేపథ్యంలో విదేశాల తరహాలో దేశంలో మొట్టమొదటిసారిగా రహదారిపై ఎలక్ట్రిసిటీ సిస్టమ్ సాంకేతికత రానుంది. అంటే.. ఈ హైవేలో వెళ్లే అన్ని వాహనాలు పవర్ ద్వారానే ప్రయాణిస్తాయి. రైళ్లు, మెట్రో ట్రైన్లు ఎలా అయితే కరెంటుతో నడుస్తున్నాయో అలాగే ఈ హైవే పై ఎలక్ట్రిక్ వాహనాలు కూడా నడుస్తాయి. జర్మనీలో రెండేళ్ల క్రితమే ఈ ఎలక్ట్రిక్ హైవే టెక్నాలజీని తొలిసారిగా నిర్మించారు. దీంతో హైవేపై వెళ్లే క్రమంలో వాహన ట్రక్కులు అప్పటికప్పుడే రీచార్జ్ చేసుకుంటాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇందన ధరల పెరుగుదలతో అందరూ ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తున్నారు. ఇందన వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత రవాణా అభివృద్ధికి ఎలక్ట్రిసిటీ అనేది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎలక్ట్రిక్ హైవే ప్రాజెక్టుపై ప్రతిపాదనలకు ఆమోదం వస్తే.. ఎలక్ట్రిక్ హైవే రవాణాను మరింత విస్తరించడం ద్వారా అభివృద్ధి చెందుతుందని విశ్లేషకులు అంటున్నారు. భారత్లో ముందుగా ఢిల్లీ నుంచి జైపూర్ మధ్య ఈ ఎలక్ట్రిక్ హైవేను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది కేంద్రం. అంతా అనుకున్నట్టు జరిగితే.. ఢిల్లీ-మంబై నగరాల మధ్య కూడా ఎలక్ట్రిక్ హైవే వచ్చేందుకు అవకాశం ఉంది.