తెలంగాణ సీఎం కెసిఆర్ తాగు బోతులకు... డ్రామా రావు డ్రగ్స్ వాడే వాళ్లకు అంబాసిడర్ అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో డ్రగ్స్ కేసు లో పిలుస్తున్న హీరో లకు డ్రామా రావు దోస్తు కాదా ? డ్రగ్స్ కి మన పిల్లలను బానిసలు చేద్దామా ? అని ప్రశ్నించారు. విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు రేవంత్ రెడ్డి. గుట్కా..హుక్కా సెంటర్ లు నడుస్తున్న ఎందుకు పట్టించుకోవని.. కేసీఆర్ ను నిలదీశారు రేవంత్. టీ ఆర్ ఎస్ సన్నాసులు గజ్వెల్ రండి చూసుకుందాం అన్నారని... 2 లక్షలు మంది కాంగ్రెస్ కార్యకర్తలు గజ్వెల్ గడ్డ మీద కదం తొక్కారన్నారు.
స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం నిజాం రజాకారులు ను ఇదే రోజు తరిమి కొట్టారని... మల్లన్న సాగర్ లో 60 వేలు ఎకరాలు భూమి తీసుకుని 14 గ్రామాలను ముంచారని మండిపడ్డారు. కొండ పోచమ్మ సాగర్ లో తమ బంధువులు భూమి కాపాడడం కోసం పేదలు భూమి ని లాక్కొన్నారని... మెదక్ ప్రజలు ఆదరించి ఎంపీ చేయడం వలన ఇందిరా గాంధీ ప్రధాని అయిందన్నారు. నాలుగు కోట్ల ప్రజలు విముక్తి కోసం, పార్టీ ప్రయోజనాలు వదిలేసి తెలంగాణ ఇచ్చిందని... పార్టీ ని విలీనం చేస్తానని మోసం చేసిన దగుల్బాజీ కేసీఆర్ అని నిప్పులు చెరిగారు. అర శాతం జనాభా ఉన్న కేసీఆర్ ఇంట్లో నాలుగు పదవులు ఉన్నాయని.. 12 శాతం ఉన్న మాదిగలకు మంత్రి పదవి ఇవ్వలేదని నిప్పులు చెరిగారు.
ఇందిరా గాంధీ ఇచ్చిన పోడు భూములను హరిత హారం పేరు తో లాక్కొన్నారని... సన్న బియ్యం, చేప పిల్లలు, గొర్రెలు కోసం యువకులు ప్రాణ త్యాగము చేయలేదన్నారు. కరోనా ని ఆరోగ్య శ్రీ లో చేర్చకుండా వేలాది మంది ప్రాణాలు పోవడానికి కేసీఆర్ కారణం అయ్యాడని... కేసీఆర్ సీఎం అయ్యాక 4632 బడులు ను మూసి వేయించాడని నిప్పులు చెరిగారు. ముస్లిం లకు 12 శాతం ఇస్తానని చెప్పి ఏడున్నర ఏళ్ళు అయిందని... ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని తుంగలో తొక్కాడని ఫైర్ అయ్యారు. తెలంగాణ వచ్చిన మొదటి ఏడాది మద్యం ఆదాయం 10883 కోట్లు.. కానీ ఇప్పుడు 36000 కోట్లు ఆదాయం వస్తుందన్నారు. మద్యం ఆదాయం 300 శాతం పెరిగిందని ఆరోపించారు. తుది దశ తెలంగాణ ఉద్యమానికి సిద్ధం కావాలని... రాబోయే 19 నెలలు తెలంగాణ భవిషత్తు ను డిసైడ్ చేయబోతోందన్నారు.