ఫీజు భూతం: 'నాసిరకం' విద్యకు ముగింపు పలకండి...
మాములుగా ఆయా తరగతులకు సబంధించి ఏమి నేర్పించాలి అనే విషయాలను ప్రభుత్వం ఒక విద్యా కరికలం ను తయారుచేసి అన్ని పాఠశాలలకు అందిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన పాఠాలను మాత్రమే విద్యార్థులకు బోధించాల్సి ఉంటుంది. అంతే కాకుండా పిల్లలకు మానసికంగా ఎటువంటి ఒత్తిడి కలుగకుండా ఉండేలా మాత్రమే బోధనా చేయాలని ఉపాధ్యాయులకు సైతం కొన్ని నియమాలను ఇస్తారు. కానీ దాదాపుగా సగానికి పైగా పాఠశాలలు మరియు ఉపాధ్యాయులు ఈ నిబంధనలను తుంగలో తొక్కేస్తారు. ఆ తరగతి నాలుగు గోడల మధ్యన పిల్లలను పాఠాలు బోధించే పేరిట వారి మనసుతో ఆడుకుంటారనుకోండి.
ఒక అంశాన్ని బోధించేటప్పుడు పిల్లలకు అర్ధమయ్యే రీతిలోనే చెప్పాలి. ఏదైనా ఒక ప్రత్యక్ష ప్రయోగం ద్వారా వివరిస్తూ చెబితే పిల్లల మనసులోకి వెళుతుంది. ఇలా చెప్పిన అంశాన్ని మళ్ళీ వారివుకి అర్థమైందా లేదా అని ఒక చిన్న టెస్ట్ ద్వారా తెలుసుకోవాలి. టెస్ట్ అంటే పరీక్ష పెట్టడం కాదు. వారికి అర్ధమయిన విషయాన్ని వారి సొంత మాటల్లో వివరించేలా వారిని ప్రేరేపించాలి.
ఉదాహరణకు: ఒకటవ తరగతి పిల్లవాడికి అంకెలు నేర్పించాలి అనుకుంటే... కొన్ని వస్తువులను ఉపయోగించి వారికి సులభంగా నేర్పించాలి. వాటిని లెక్కిస్తూ వారిని మళ్ళీ చెప్పమనాలి..ఆ తరువాత వస్తువులను ఒక టేబుల్ పై ఉంచి మీరే వారిని ఒక వస్తువును తీసుకో, రెండు వస్తువులను తీసుకో అంటూ...ప్రాక్టీస్ చేయిస్తే పిల్లలకు ఆ విషయం ఎప్పటికీ గుర్తుండి పోతుంది.
అలా కాకుండా 1 నుండి 9 వరకు అంకెలన్నీ బోర్డు మీద రాసి ..వారి చేత బుక్స్ లో రాయించి...బట్టీ పట్టిస్తే అప్పటివరకూ గుర్తుంటాయి అంతే, కొన్నిరోజులకు మరిచిపోతారు. పైగా చాలా ఒత్తిడిగా ఉంటుంది. ఇలాంటి చదువు అవసరమా ? అని తల్లితండ్రులు ఆలోచించాలి. బట్టీ చదువులకు స్వస్థి చెప్పాలి. ఇలాంటి నాసిరకమైన విద్యావిధానాలను వ్యతిరేకించాలి. ఇందులో ప్రజలకన్నా ప్రభుత్వమే ఎక్కువగా చిరవ తీసుకోవాలి. సహజమైన విద్యావిధానాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి సక్సెస్ రేట్ ఉంది.
కాబట్టి మీ పిల్లలు చదివే స్కూల్ లో ఏ విధమైన విద్యావిధానం అమలులో ఉందో గ్రహించండి.