సెంచరీ కొట్టిన డీజిల్ ధర?
దేశంలో రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరిగిపోతున్న తీరు సామాన్య ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మొన్నటి వరకు సెంచరీ కొట్టిన పెట్రోల్ ధరలు ఇక ఇటీవల ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడంతో కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఇక ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయో లేదు అప్పుడే మళ్లీ పెట్రోల్ ధరలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడికి ఎంతో భారంగా మారిపోతున్నాయి. ఇక అత్యవసరమైతే తప్ప వాహనాన్ని బయటకు తీయడం లేదు వాహనదారులు.
అయితే మొన్నటి వరకు పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టాడం చూశాం ఇక ఇప్పుడు డీజిల్ ధరలు కూడా సెంచరీ కొట్టింది. ఇటీవలే రాజస్థాన్ లో డీజిల్ ధర ఏకంగా సెంచరీ కొట్టడం సంచలనంగా మారింది. పెట్రోల్ డీజిల్ పై అత్యధిక వ్యాట్ రాజస్థాన్లోని ఉంటుంది. ఈ క్రమంలోనే రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లా లో లీటర్ పెట్రోల్ ధర 107.22 రూపాయలకు ఉండగా.. అటు డీజిల్ ధర 100.2 రూపాయలకు చేరింది. రాజస్థాన్ తర్వాత మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో వ్యాట్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజులు ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే హైదరాబాద్ లో పెట్రోల్ ధర కూడా సెంచరీ కొట్టడం ఖాయం అని అర్థమవుతుంది.