మొన్న రాజకీయ సన్యాసం.. మళ్లీ అప్పుడే రంగంలోకా?
ఇలా పదేళ్ల పరిపాలన తర్వాత జయలలిత లేకుండా పోటీ చేసిన ఎన్నికల్లో కూడా ఏఐఏడీఎంకే పార్టీని ముందుకు నడిపించడంలో అటు పళని స్వామి విజయవంతమయ్యారు అనే చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ప్రతిపక్ష హోదా సాధించుకున్న ఏఐఏడీఎంకే పార్టీ ని మళ్ళీ ముందుకు నడిపించడానికి చిన్నమ్మ శశికళ రాబోతున్నారా అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను అంటూ ప్రకటించారు చిన్నమ్మ శశికళ. ఇక మొన్ననే రాజకీయ సన్యాసం అంటూ ప్రకటించి మళ్ళీ పార్టీని నడిపించేందుకు రావడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇటీవలే శశికళ తో ఒక వ్యక్తి మొబైల్ లో మాట్లాడిన సంభాషణ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం పార్టీని ఆదుకోవడానికి మీరు రావాలమ్మా అంటూ సదరు వ్యక్తి శశికళను కోరగా.. ఆందోళన అవసరం లేదని నేను ఉన్నాను.. పార్టీని నిలబెట్టడానికి వస్తాను అంటూ హామీ ఇచ్చారు శశికళ. దీన్ని బట్టి చూస్తే ఇక మరికొన్ని రోజుల్లో శశికళ తన గేమ్ స్టార్ట్ చేయబోతున్నారు అని విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో ఇటీవలే రాజకీయ సన్యాసం తీసుకున్నాను అంటూ తెలిపిన శశికళ... అంతలోనే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతారా అన్నదానిపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. ఏం జరుగుతుంది అన్నది మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది.