తండ్రిని అనాథను చేసిన కొడుకులు.. ఏం చేసారో తెలుసా..?

praveen
నవమాసాలు మోసి  తల్లి జన్మనిచ్చిన తర్వాత.. ఈ లోకం తీరు ని పరిచయం చేస్తూ నడక నేర్పిన నాన్న  ప్రేమ ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఏ చిన్న కష్టం రాకుండా చూసుకుంటూ పెంచి పెద్ద చేస్తూ ఉంటాడు.. తన కష్టాలను దాచుకుని ఇక పిల్లలకి సంతోషాన్ని పంచడానికి ఎప్పుడూ ప్రయత్తినిస్తూ ఉంటాడు. అలాంటి తల్లిదండ్రులలు ఈ మధ్య కాలంలో మాత్రం ఎవరు కూడా కనీస గౌరవం ఇవ్వడం లేదు. ఇక ఏకంగా ఏ చిన్న కష్టం రాకుండా చూసుకున్న నాన్న విషయంలో ఎవరూ కనికరించడం  లేదు. అయితే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు తోడు ఉండాల్సిన పిల్లలు చివరికి తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేస్తున్న ఘటనలు ఎన్నో తెరమీదికి  వస్తున్నాయి. దీంతో వృద్ధాప్యంలో తల్లిదండ్రులు  పిల్లల తీరుతో ఎంతగానో బాధ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.




 అయితే కొంతమంది తల్లిదండ్రులను తమతోపాటు ఉంచుకోలేక వృద్ధాశ్రమంలో   వదిలేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నారు.  తల్లిదండ్రులను వదిలించుకోవడానికి ఎంతో దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఓ కొడుకు చేసిన పనికి ప్రస్తుతం అందరు షాక్ అవుతున్నారు.. చిన్నప్పటి నుంచి ఆలనాపాలనా చూస్తూ ఏ చిన్న సమస్య కూడా రాకుండా  పెంచి పెద్ద చేసిన నాన్న విషయంలో కొడుకులు కసాయిలు గా మారిపోయారు. వృద్ధాప్యంలో ఆ తండ్రిని ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన కొడుకులు చివరికి కనీస కనికరం లేకుండా ప్రవర్తించారు.



 చివరికి వృద్ధాప్యంలో కూడా ఆ తండ్రి పున్నామ నరకం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కన్న తండ్రిని కొడుకులు అడవిలో వదిలేసిన ఘటనా వికారాబాద్ లో చోటుచేసుకుంది. నర్సింగ్ కు చెందిన స్వాములు అనే అరవై ఏళ్ల వ్యక్తికి ఇద్దరు కొడుకులు అయితే తండ్రిని వదిలించుకోవాలి అంటూ భార్యలు పోరు పెట్టడంతో ఇక తండ్రిని తీసుకెళ్లి నిర్మానుష్యమైన అడవిలో వదిలేశారు. అయితే ఎన్నో ఆపసోపాలు పడుతూ చివరికి వికారాబాద్ చేరుకోగలిగాడు వృద్ధుడు. అయితే అతని సమస్యలు విన్న ఒక హోటల్ యజమాని అతనికి సహాయం చేశాడు ప్రస్తుతం ఆయన నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dad

సంబంధిత వార్తలు: