పుర పోరు: ప‌్ర‌కాశం వైసీపీలో హీరోలెవ‌రు.. జీరోలెవ‌రు ?

VUYYURU SUBHASH
వ‌చ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్‌, మునిసిప‌ల్ ఎన్నిక‌లు ప్ర‌కాశం జిల్లాలో అధికార వైసీపీలో ప‌లువురు కీల‌క నేత‌ల‌కు అగ్నిప‌రీక్ష‌గా మారాయి. జిల్లాలో మొత్తం ఏడు ప‌ట్ట‌ణాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. జిల్లా కేంద్ర‌మైన ఒంగోలు కార్పొరేష‌న్లో 50 డివిజ‌న్లు ఉన్నాయి. మార్కాపురంలో 35 వార్డులు, చీరాల‌లో 33, అద్దంకిలో 20, చీమ‌కుర్తిలో 20, క‌నిగిరిలో 20, ద‌ర్శిలో 20 వార్డులు ఉన్నాయి. వీటిల్లో అద్దంకిలో మాత్రం టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. చీరాల‌లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీ చెంత చేరిన క‌ర‌ణం బ‌ల‌రాం ఉన్నారు. ఇక్క‌డ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఉన్నారు.
ఈ ఏడు ప‌ట్ట‌ణాల్లో చైర్మ‌న్లు, మేయ‌ర్ల రిజ‌ర్వేష‌న్లు చూస్తే ఒంగోలు మేయ‌ర్ ఎస్సీ మహిళ‌కు, చీరాల జ‌న‌ర‌ల్‌కు, మార్కాపురం జ‌న‌ర‌ల్‌, కందుకూరు జ‌న‌ర‌ల్ మ‌హిళ‌, ద‌ర్శి జ‌న‌ర‌ల్‌, చీమ‌కుర్తి బీసీ జ‌న‌ర‌ల్‌, అద్దంకి ఎస్సీ మ‌హిళ‌, క‌నిగిరి బీసీ జ‌న‌ర‌ల్‌, గిద్ద‌లూరు బీసీ జ‌న‌ర‌ల్‌కు రిజ‌ర్వ్ అయ్యాయి. ఈ ఏడు ప‌ట్ట‌ణాల్లో ఒంగోలులో మంత్రి బాలినేని మేయ‌ర్ పీఠాన్ని సులువుగా గెలిపించేలా ఉన్నారు. మార్కాపురంలోనూ పార్టీకి ఎదురు లేదు. చీరాల‌లో మాత్రం రెండు వ‌ర్గాలు ఉండ‌డంతో రెండు వ‌ర్గాల‌కు టిక్కెట్లు ఇచ్చారు. వీరిలో ఏ వ‌ర్గం స‌త్తా చాటుతుందో ?  దానిని బట్టే ఇక్క‌డ రెండో నేత భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంది.
ఇక అద్దంకిలో తేడా వ‌స్తే బాచిన ఫ్యామిలీకి రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేన‌ట్టే అంటున్నారు. వాళ్ల స‌త్తాకు ఇది అగ్నిప‌రీక్ష. చీమ‌కుర్తి ఎన్నిక‌లు సంత‌నూత‌ల‌పాడు ఎమ్మెల్యే సుధాక‌ర్ బాబుకు ప‌రీక్ష కానున్నాయి. క‌నిగిరిలో ఎమ్మెల్యే మ‌ధుసూద‌న్‌పై ఉన్న వ్య‌తిరేక‌త ఫ‌లితాల‌పై ప్ర‌భావం చూపుతుందా ? అన్న సందేహాలు ఉన్నాయి. ద‌ర్శిలో ఏకంగా మూడు గ్రూపులు ఉన్నాయి. ఇక్క‌డ పార్టీ వాళ్ల‌కు సొంత పార్టీ వాళ్లే వెన్ను పోట్లు పొడుస్తోన్న ప‌రిస్థితి. మ‌రి వీరిలో ఎవ‌రు త‌మ మునిసిపాల్టీని వైసీపీ ఖాతాలో వేసి హీరోలు అవుతారో ?  లేదా ఓడిపోయి జీరోలు అవుతారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: