గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట సీటు త్యాగం చేసిన పార్టీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తానన్న జగన్ ఆయన్ను పట్టించుకోవడం లేదు. ఇక మంగళగిరిలో గత ఎన్నికల్లో చంద్రబాబు తనయుడు.. అప్పుడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ పోటీ చేశారు. ఆ ఎన్నికల ప్రచారంలో జగన్ ఆర్కేను గెలిపిస్తే కేబినెట్లో కూర్చో పెట్టుకుంటానని చెప్పారు. ఆ తర్వాత ఆయన్ను సీఆర్డీచే చైర్మన్ను చేసినా దాని వల్ల ఉపయోగం లేదు. ఇక ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉన్న మంగళగిరిపై మూడు రాజధానుల