అమిత్ షాని ఏపీ సీఎం జగన్ ఎందుకు కలిసారంటే....?

Shirisha
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్    హఠాత్తుగా ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేశాయి. అయితే ఈ పర్యటన కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేపట్టినట్టు స్పష్టమైంది.కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రాత్రి భేటీ అయ్యారు. సుమారు ఒక గంటా 25 నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోలవరం సహా పలు అంశాలపై చర్చించిన సీఎం ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు అంశం, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలను సీఎం జగన్‌.. అమిత్‌ షా దృష్టికి తీసుకువచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి కోరారు సీఎం జగన్.  సమావేశం సమయంలో సీఎం జగన్‌ మోహన్ రెడ్డి వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ఉ‍న్నారు.
రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ,కర్నూలు హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్‌‌కు ఆమోదం తెలిపాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ప్రాంతాల వారీగా అభివృద్ధిలో సమతుల్యతను సాధించడంలో భాగంగా అధికార వికేంద్రీకరణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీంట్లో భాగంగా రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించాలని, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానిని, అమరావతిలో శాసన రాజధానిని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేసింది
విజయనగరం జిల్లా సాలూరులో ట్రైబల్‌ యూనివర్శిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 250 ఎకరాలను గుర్తించింది. ఈ ప్రాంతం సబ్‌ప్లాన్‌ ఏరియాలో ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రైబల్‌ యూనివర్శిటీ ఏర్పాటుకు తగిన చర్యలను సంబంధితశాఖ తీసుకునేలా చూడాలని అన్నారు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నా. ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ఇది చాలా అవసరం. ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కారణంగా కేంద్రం నుంచి గ్రాంట్లు లభిస్తాయి. దీనివల్ల ఆర్థిక భారం క్రమంగా తగ్గుతుంది. కొత్త పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
2017–18 ధరల సూచీని పరిగణలోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ  సిఫార్సుమేరకు ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 55,656.87 కోట్లుగా ఆమోదించాలని,ఈ మేరకు రెండవ రివైజ్డ్‌ కాస్ట్‌ ఎస్టిమేట్స్‌కు ఆమోదం తెలపాలని కేంద్ర హోంమంత్రిని కోరారు జగన్
2014–15 నాటికి రెవిన్యూ లోటు రూ. 22, 948.76 కోట్లు అని రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. కాని రూ. 4,117.89 కోట్లు మాత్రమే కేంద్రం గుర్తించింది. ఇందులోకూడా రూ. 3,979.5 కోట్లు మాత్రమే విడుదలచేసింది. ఇందులో మిగిలిన బకాయిలతోపాటు, రాష్ట్రం పేర్కొన్న విధంగా మిగిలిన రూ. 18830.87 కోట్లు విడుదలచేయాలని కోరారు .
కోవిడ్‌ వ్యాక్సినేషన్, మెడికల్‌ కాలేజీలకు అనుమతులు ఇవ్వండి. జనవరి 16 నుంచి 332 కేంద్రాల్లో వాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైందని సీఎం జగన్ వెల్లడించారు. వచ్చే 10 రోజుల్లో ఆరోగ్య సిబ్బంది అందరికీ వాక్సినేషన్‌ పూర్తిచేసేదిశగా రాష్ట్రం చర్యలు తీసుకుంటోంది.రాష్ట్రంలో నాణ్యమైన వైద్య సేవలకోసం వైద్యులు, నర్సుల సిబ్బంది సంఖ్యను పెంచాల్సి ఉంది.దీని కోసం కొత్తగా 13 మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.వీటితో పాటు ఇది వరకే ఉన్న మెడికల్‌ కాలేజీల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం.ఇప్పటికే మూడు కాలేజీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
మిగిలిన 13 కాలేజీలను, వాటికి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీలను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు .
లాక్‌డౌన్‌ తదనంతర పరిణామాల్లో భాగంగా చాలామంది తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వచ్చారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయాల్సి ఉంది
ఉపాధి హామీ కింద ప్రస్తుతం ఉన్న పని దినాలు 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచాలని కోరారు .
ఏపీ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు చెల్లించాల్సిన రూ.4282 కోట్ల బకాయిలను కేంద్రం చెల్లించాల్సి ఉందని.. ఈ బకాయిలను వెంటనే విడుదలచేయాలని సీఎం  కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: