సోమవారం తెలంగాణకు మరో గుడ్ న్యూస్
సోమవారం నుండి వ్యాక్సిన్ డోసులు పెరుగుతాయి అని ఆమె పేర్కొన్నారు. నేను వ్యాక్సిన్ తీసుకోలేదు.. మొదటి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అని మోడీ చెప్పారు అని అన్నారు. నేను ప్రజలతో పాటు తీసుకుంటాను అని అన్నారు. వ్యాక్సిన్స్ సురక్షితమైనది.. 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ అని ఆమె వెల్లడించారు. వరల్డ్ లార్జెస్ట్ వాక్సినేషన్ భారత్ లోనే అని గవర్నర్ పేర్కొన్నారు. వ్యాక్సిక్ పై అపోహలు వద్దు..హెల్త్ వర్కర్స్ కూడా అపోహతో ఉన్నారు అని అన్నారు. వ్యాక్సిన్ సురక్షితం.. ఎలాంటి ప్రమాదం కలగదు అని ఆమె హామీ ఇచ్చారు.
సోమేష్ కుమార్ మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది అని ఆయన అన్నారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తలేదు అని పేర్కొన్నారు. ఇవ్వాళ ప్రతి కేంద్రం లో 30మందికి వ్యాక్సిన్ ఇస్తున్నాం అని ఆయన వెల్లడించారు. సోమవారం నుంచి దశల వారీగా ఎక్కువ మందికి ఇస్తాం అని ఆమె పేర్కొన్నారు. వ్యాక్సిన్ పై అపోహలు అవసరం లేదు అని అన్నారు. కేంద్రం ఇచ్చిన సూచనల ప్రకారం నేను వ్యాక్సిన్ వేసుకోలేదు అని ఆమె అన్నారు. లేకుంటే నేనే ముందుగా వేసుకొని అపోహలు దూరం చేసే వాడిని అని ఆయన అన్నారు.