ఆయన నీ చివరి చూపు చూసేందుకు కూడా దక్కలేదు.. ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ కామెంట్స్..!

lakhmi saranya
జబర్దస్త్ అనే కామెడీ షో ఎంతో మంది నటీనటులకి లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా ఎంతోమంది స్టార్స్ గా ఎదిగారు. అటువంటి వారిలో కమెడియన్స్ ఎక్కువగా ఉన్నారు. వారిలో ఇమాన్యుయల్ కూడా ఒకరు. కలర్ తక్కువగా, బట్టతల ఉండడంతో తన మీద తానే పంచులు వేసుకుని బాగా ఫేమస్ అయ్యాడు. ఈ కమెడియన్. ఇక వర్షా తో లవ్ ట్రాక్ అతడిని ఎక్కడికో తీసుకెళ్ళింది. ప్రజెంట్ ఇప్పుడు షోస్ మాత్రమే కాకుండా పలు సినిమాలు కూడా చేస్తున్నాడు.
తాజాగా ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గం గం గణేశా సినిమాలో ఇమాన్యుయల్ హీరో ఫ్రెండ్గా నటించాడు. మే 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. దీంతో సినిమాపై మరిన్ని హైప్స్  కూడా నెలకొంటున్నాయి. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇమాన్యుయల్ తన జీవితంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ ని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ నటుడు మాట్లాడుతూ.." జబర్దస్త్ లో అప్పుడప్పుడే ఎదుకుతున్న రోజులు. స్కిట్ చేస్తున్న సమయంలో ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. మా తాత చనిపోయాడు.
ఇంటికి రమ్మని స్కిట్ మధ్యలో వదిలేసి వెళ్లలేను. నాకు మా తాత అంటే చాలా ఇష్టం. ఏం చెయ్యలేని పరిస్థితి. స్టేజి వెనక్కి వెళ్లి వెకెక్కి ఏడ్చి కళ్ళ నీళ్లు తుడుచుకుని స్కిట్ చేశాను. నా కెరీర్ బెస్ట్ స్కిట్స్ లో అది కూడా ఒకటి. ఇక స్కిట్ అయ్యాక ఇంటికి బయలుదేరాను. కానీ అప్పటికే తాత అంత్యక్రియలు అయిపోయాయి. ఆయన చివరి చూపు కూడా దక్కలేదు " అంటూ ఎమోషనల్ అయ్యాడు ఈ కమెడియన్. ప్రజెంట్ ఇమ్మానుయేల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇక ఇమాన్యుల్ వ్యాఖ్యలు చూసిన పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: