కమల్హాసన్ పోరాటం ఫలించింది.. అనుకున్నది సాధించారు..
ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ ప్రకటించారు. అణగారిన వర్గాల జీవన ప్రమాణాల మెరుగు కోసం పోరాటం చేసిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పుట్టిన రోజు నాడు తమకు ఈ గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘానికి, ఇందుకు సహకరించిన అందరికీ కమల్ కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవానికి 2019 లోక్సభ ఎన్నికల్లో కమల్ పార్టీ ఈ గుర్తుపైనే పోటీ చేసింది. వాస్తవానికి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఎన్ఎం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం టార్చ్లైట్ గుర్తును కేటాయించింది.
దీంతో కమల్హాసన్, పార్టీ నేతలు, కార్యకర్తలు పార్లమెంట్ ఎన్నికల్లో టార్చ్లైట్లు చేత పట్టుకుని తీవ్ర ప్రచారం సాగించారు. దీంతో మక్కల్ నీది మయ్యం పార్టీ గుర్తు టార్చ్లైట్ అని ప్రజల మదిలో సుస్థిరంగా నాటుకుంది.మొత్తానికి కమల్హాసన్ అనుకున్నది సాధించుకున్నారు. ఇక ఎన్నికల బరిలోకి దూకి మరింతగా దూసుకెళ్లాలని పార్టీ శ్రేణులు కోరుతున్నారు.