ప్రేమకు పెద్దలు నో చెప్పడంతో.. అనూహ్య నిర్ణయం తీసుకున్న జంట..?

praveen
ఈ మధ్య కాలంలో ప్రేమించడమే పాపం గా మారింది. ప్రేమ ఎన్నో  కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ప్రేమ ఎంతో మందిని ఉన్మాదులు గా మారుస్తుంది. ఈ మధ్య కాలంలో ప్రేమించిన వారు తమ ప్రేమకు పెద్దలు ఒప్పు కోలేదు అనే కారణం తో ఆత్మహత్య చేసుకొని మరణిస్తే...  తమకంటే తక్కువ వారిని ప్రేమించారు అనే కారణంతో తల్లి దండ్రులు సొంత పిల్లలను  దారుణం గా హతమార్చిన సంఘటనలు కొన్ని ఇలా ప్రేమించడమే నేటి రోజుల్లో పాపం గా మారి పోయింది. ఇక్కడ సంక్రాంతి పండుగ వేళ ములుగు లో విషాదకర ఘటన చోటు చేసుకుంది.



 వివరాల్లోకి వెళితే.. రామప్ప మండలం నల్లగొండ గ్రామం సమీపం లోని దేవాదుల పైప్లైన్ వద్ద ఇటీవలే ఓ ప్రేమ జంట ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. నల్లగొండ గ్రామానికి చెందిన  21 ఏళ్ల యువకుడు.. భూపాల పల్లికి చెందిన 17 ఏళ్ల యువతి కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు.  ఇటీవలే వీరి ప్రేమ విషయం యువతి ఇంట్లో తెలిసింది. ఇక యువతి తల్లి దండ్రులు వీరిద్దరి,ప్రేమకు అడ్డు చెప్పారు. పెళ్లి చేసేందుకు నిరాకరించారు.  అంతే కాదు ఇకపై ఆ యువకుడిని కలవ కూడదు మాట్లాడ,కూడదు అంటూ బెదిరించారు. అయితే ఆ యువకుడిని విడిచి ఉండలేక పోయింది యువతి.




 ఈ క్రమంలోనే ఇటీవలే నల్లగొండలోని బంధువుల ఇంటికి వచ్చిన యువతి.. అతికష్టం మీద ప్రియుడిని కలుసుకుంది.  ప్రేమ  విషయంలో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అంటూ ప్రియుడితో చెప్పి బోరున విలపించింది. ఇక ఇద్దరు కలిసి బతకలేనప్పుడు చని పోదాము అని నిర్ణయించుకుని..  గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి పురుగుల మందు తాగారు. అటుగా వెళుతున్న కొంతమంది గ్రామస్తులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి  పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: