గ్రేటర్ యుద్ధం : గట్టి పోటీ ఇచ్చి పుంజుకున్న బీజేపీ..క్రెడిట్ ఎవరికి ?

Chaganti
గ్రేటర్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌లో టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. టీఆర్ఎస్ 56 స్థానాలు సాధించగా, ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 స్థానాల దరికి చేరింది. చాలా స్థానాల్లో స్వల్ప మెజారిటీతో బీజేపీ అభ్యర్థులు గెలుపు సాధించారు. అధికార టీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కడుతూనే.. బీజేపీకి  ఏకంగా 49 స్థానాలు కట్టబెట్టారు ఓట్లరు. ఎవ్వరూ ఊహించని విధంగా పలు స్థానాల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. 


గత ఎన్నికల్లో 99 స్థానాలు సాధించిన అధికార టీఆర్ఎస్ పార్టీ .. ఇప్పుడు కేవలం 56 స్థానాలకే పరిమితమైంది. 2016 ఎన్నికల్లో నాలుగు స్థానాలకే పరిమితమై సాధించిన బీజేపీ .. 49 స్థానాలను దక్కించుకుంది. గతంతో పోలిస్తే ఎంఐఎం పార్టీ ఓ స్థానం కోల్పోయి 43 స్థానాలు నిలబెట్టుకుంది. ఓల్డ్ సిటీతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. దీంతో బీజేపీ నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ విజయం కార్యకర్తల వీరోచిత పోరాట ఫలితమేనన్నారు బీజేపీ నేతలు. 


ఇక గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది . కేవలం రెండు సీట్లలో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ, కాంగ్రెస్ పీసీసీ అధక్ష పదవికి... ఉత్తమ్‌కుమార్ రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు బీజేపీ గెలుపుకోసం ఆ పార్టీ అగ్ర నేతలు సహా, జనసేన కార్యకర్తల దాకా చాలా మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాటు పడ్డారు. దీంతో ఇప్పుడు ఈ గెలుపు క్రెడిట్ ఎవరికీ దక్కుతుంది ? అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: