గ్రేటర్ యుద్దం : ఉప్పల్ లో దొంగ ఓట్ల కలకలం..కాంగ్రెస్ వాళ్లెనట..!!
సూర్య పేట్ కు చెందిన కొంత మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉప్పల్ డివిజన్ కు సంబందించిన వారికి అనుకూలంగా కొంతమంది ఆధర్ ఫోటోలు మార్చి అధికారుల కళ్ళు గప్పి దొంగ ఓట్లు వేస్తున్నారట.అక్కడ ఉన్న కొందరి పై టిఆర్ఎస్ కార్య కర్తలకు అనుమానం వచ్చి వారిని నిలదీయ్యగా ఇరు వర్గాలకు మద్య ఘర్షణ చోటుచేసుకుంది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను ఎంక్వైరీ చేయాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఫేక్ గుర్తింపు కార్డులతో దొంగ ఓట్లు వేస్తూ రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని గ్రహించారు.వెంటనే వారిని అదుపులోకి తీసుకుని వారి దగ్గర ఉన్న ఫేక్ గుర్తింపు కార్డులను స్వాదినం చేసుకున్నారు. .