ఓటు వేసేందుకు వంతెన నిర్మించుకున్నారు.. ఇక చివరికి..?
కాగా ఇక మూడు విడతల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరుగిన విషయం తెలిసిందే. ఎంతో మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూతుల వద్దకు బారులు తీరుతున్నారు. అయితే సాధారణంగా అయితే నేటి కాలంలో కొంచెం కష్టం అనిపించింది అంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా మంది వెనక అడుగు వేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎవరు గెలిచినా మనకు వచ్చేది ఏముందిలే అనుకుంటూ నిర్లక్ష్యం వహిస్తుంటారు ఓటు వేయడానికి.
కానీ కొంతమంది ప్రజలు మాత్రం అష్టకష్టాలు పడి అయినా సరే ఓటు వేయడానికి పోలింగ్ బూత్ ల వద్ద కు తరలి వస్తుంటారు. ఇక్కడ ఓ ప్రాంత ప్రజల ఓటు వేయాలనే సంకల్పం చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ఓటు వేసేందుకు బీహార్లోని దర్భంగా ప్రజలు చూపిన చొరవ ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటోంది. దర్భంగా ప్రాంతానికి చెందిన ఐదు వేల మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలు చేరుకోవడానికి నది దాటడం తప్పనిసరి. ఇక ఎలాగైనా ఓటు వేయాలని అందరూ కలిసి ఓ వినూత్న ఆలోచన చేసి తాత్కాలికంగా కర్రలతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. కాస్త ప్రమాదం అని తెలిసినప్పటికీ ఈ వంతెనపై వెళ్లి ఓటు వేసి వచ్చిన వారిపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది.