డ్రగ్స్ కేసులో నోరు విప్పని రకుల్ ప్రీత్ సింగ్ !

NAGARJUNA NAKKA
బాలీవుడ్ డ్రగ్స్‌ కేసు టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఈ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటపడటం సంచలనంగా మారింది. రియాను విచారిస్తున్న సమయంలో రకుల్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అసలు...డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌కు టాలీవుడ్‌కు సంబంధం ఏంటి? రకుల్ పేరు బయటకొస్తే తెలుగు చిత్రసీమ ఎందుకు వణికిపోతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.    
బాలీవుడ్‌లో మొదలైన డ్రగ్స్‌ ప్రకంపనలు టాలీవుడ్‌కు పాకాయి. ఈ కేసులో ఇప్పటికే నటి రియా చక్రవర్తి అరెస్ట్‌ కాగా..ఆమె వెల్లడించిన 25 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసేందుకు నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే రియా బయటపెట్టిన జాబితాలో టాలీవుడ్‌ తారా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పేరు కూడా ఉంది. రియా కాల్ లిస్ట్‌లో తెలుగు హీరోయిన్లు, హీరోల పేర్లు బయటకు వస్తుండటం సంచలనం రేపుతోంది.
గతవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న రకుల్‌...డ్రగ్స్‌ కేసు రచ్చ సాగుతుండగా తన సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉంది. మూడు రోజులుగా వికారాబాద్ శివారులో ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది.  డ్రగ్స్‌ కేసులో తన పేరు బయటకు రావడంతో అక్కడినుంచి హుటాహుటిన జూబ్లీహిల్స్‌ నివాసానికి వెళ్లినట్లు తెలుస్తోంది. మరో మూడు రోజుల పాటు సినిమా షూటింగ్‌కు రానని కూడా యూనిట్‌ సభ్యులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఐతే ఆమెపై వస్తున్న ఆరోపణలను రకుల్‌ మేనేజర్‌ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదంతా పెద్ద కుట్ర అంటున్నారు.  
రియా వెల్లడించిన 25 మందికి నోటీసులు జారీ చేసే ప్రక్రియ జరుగుతోంది. ఈ కేసులో మరికొంత మందిని కూడా ఎన్‌సీబీ అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది. తాజా పరిణామాలతో టాలీవుడ్‌లో డ్రగ్స్‌కు అలవాటుపడ్డ వారి గుండెళ్ల రైళ్లు పరిగెత్తుతున్నాయి.  మొత్తానికి...తీగ లాగితే డొంకంతా కదిలినట్లు బాలీవుడ్‌ డ్రగ్స్‌ లింకులు టాలీవుడ్‌లోనూ బయట పడటం కలకలం రేపుతోంది. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో  చూడాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: