వారెవా.. సోనూసూద్ బొమ్మను నిమిషాల్లో గీసేశాడు..! వీడియో చూడండి..

Chakravarthi Kalyan
సోనూసూద్.. ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా ప్రశంసించబడుతున్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు. కలియుగ దాన కర్ణుడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి సోనూసూద్‌ ను ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ మెచ్చుకుంటున్నారు. అలాగే ఆయనపై వివిధ రకాలుగా తమ అభిమానం ప్రదర్శిస్తున్నారు. కోల్‌కతాకు చెందిన ఓ ఆర్టిస్ట్ కూడా ఇలాగే తన అభిమానాన్ని తన కళ ద్వారా ప్రదర్శించాడు.

ఆర్ణబ్ ముఖర్జీ ఓ పెన్సిల్ ఆర్టిస్ట్.. పెన్సిల్‌తోనే వ్యక్తుల చిత్రాలను అద్భుతంగా గీస్తాడు.. సోనూసూద్ సేవలకు మెచ్చిన ఈ ఆర్టిస్‌ ఆయన్ను ఓ భగత్‌ సింగ్‌తో పోలుస్తూ ఓ చిత్రం గీసాడు. నిమిషాల వ్యవధిలోనే గీసిన ఈ చిత్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. తాను గీసిన చిత్రాన్ని ఆయన సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఆ చిత్రం చూసి చివరకు సోనూసూద్‌ కూడా లవ్ యూ అంటూ మెచ్చుకున్నాడు.

సోనూ సూద్ ఇప్పుడు భారతదేశంలో ఓ క్రేజ్.. ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే వ్యక్తిగా పేరున్న మంచి వ్యక్తి.  అందుకే ఆయనకు భాషతో సంబంధం లేకుండా అంతా ఫ్యాన్స్ అవుతున్నారు. ఆయనపై అభిమానం వ్యక్తపరుస్తున్నారు. ఇటీవలే దీపా జయ అనే అభిమాని కూడా ఆయనకు ఓ అపురూపమైన కానుక పంపింది.. జీవం ఉట్టిపడేలా ఆయన పెయింటింగ్‌ ను రూపొందించి ఆ వీడియోను సోనూసూద్‌ కు పంపింది. చేసింది.
ఈ పెయింటింగ్ వేయడానికి చాలా కష్టపడ్డాను.. గంటల తరబడి కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తోంది. కానీ మా దేవుడిని గౌరవించుకోవడం మా విధి కదా.. వి లవ్ యు సర్ అంటూ కామెంట్ చేసింది దీపా జయ అనే ఆ అభిమాని. ఆ పెయింటింగ్ చూసి ఫిదా అయిన సోనూసూద్ కూడా యూ ఆర్ ద బెస్ట్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు.. ఇలాంటి ప్రశంసలు ఇటీవలి కాలంలో సోనూసూద్‌ కు కోకొల్లలుగా వస్తున్నాయి. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఇంతగా ప్రశంసలు పొందిన వ్యక్తి సోనూసూద్ ఒక్కడే కావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: