టి20 వరల్డ్ కప్ ప్రకటన.. ఇలాంటోళ్ళను సెలెక్ట్ చేశారేంటి?

praveen
వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతున్న టీమిండియాకు గత కొంతకాలం నుంచి వరల్డ్ కప్ గెలవడం అనేది కేవలం కలగానే మిగిలిపోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. గత ఏడాది అయితే టీమిండియాకు ఎంతటి చేదు అనుభవం ఎదురయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తప్పకుండా విజయం సాధిస్తుంది టైటిల్ విజేతగా నిలిచి విశ్వవిజేతగా అవతరిస్తుంది అనుకుంటున్న సమయంలో ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది టీమిండియా. అప్పటివరకు ఒక్క ఓటమి లేకుండా దూసుకొచ్చిన టీమిండియా ఫైనల్ లో తడబాటుకు గురైంది.

 ఇప్పుడే కాదు గత కొన్ని వరల్డ్ కప్ టోర్నీలలో కూడా ఇదే జరుగుతూ వస్తుంది  కొన్ని కొన్ని సార్లు బ్యాటింగ్ విభాగం అదర కొడితే ఇంకొన్నిసార్లు మాత్రం బౌలింగ్ విభాగం అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. అయితే ఇక జూన్ నెలలో జరగబోయే టి20 వరల్డ్ కప్ టోర్నిలో మాత్రం తప్పకుండా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. భారత జట్టు ఈ క్రమంలోనే అత్యుత్తమ ఆటగాళ్లను జట్టులోకి సెలక్ట్ చేసేందుకు సిద్ధమవుతాయి. అయితే వరల్డ్ కప్ షెడ్యూల్లో ఎవరికీ చోటు దక్కుతుందా అనే విషయంపై ఉత్కంఠ ఉండగా.. ఇటీవలే ఈ ఉత్కంఠకూ తెరపడింది. బీసీసీఐ టి20 వరల్డ్ కప్ కు సంబంధించిన భారత జట్టును ప్రకటన చేసింది.

 అయితే ఐపీఎల్ లో ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఆటగాళ్లను పూర్తిగా పక్కన పెట్టేశారు సెలక్టర్లు. అదే సమయంలో ఇక వరల్డ్ కప్ లో టీమిండియాలోకి ఎంపిక చేసిన బౌలింగ్ విభాగం పై కూడా చర్చ జరుగుతుంది. టి20 వరల్డ్ కప్ కోసం పసలేని బౌలింగ్ విభాగాన్ని ఎంపిక చేశారు అంటూ పలువురు మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 15 మంది సభ్యులలో ముగ్గురు ఫేసర్లు ఉన్నారు. బుమ్రా,అర్షదీప్, సిరాజ్ నన్ను సెలెక్ట్ చేశారు. ఇందులో బుమ్రా తప్ప మిగతా ఇద్దరు మాత్రమే రాణిస్తున్నారు. ఇక సిరాజ్ అయితే భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. వారికి బదులు ఈ ఐపీఎల్ లో రాణిస్తున్న మయాంక్ యాదవ్, నటరాజన్, సందీప్ శర్మలను తీసుకుంటే బాగుండేది అని పలువురు మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: