బాయ్‌ ఫ్రెండ్‌తో రిసార్టుకెళ్లింది.. అది వీడియో తీసి నరకం చూపించారు..

Chakravarthi Kalyan
ఈరోజుల్లో యువతకు ఎంజాయ్‌ మెంట్ ప్రధానంగా మారుతోంది. అమ్మాయిలు, అబ్బాయిలు కలసి తిరగడం కామన్ అయ్యింది.. ఏదో పార్కులు, సినిమాలు, షికార్లు అంటే కాస్త పరవాలేదు. కానీ అమ్మాయిలు ముందు వెనుక ఆలోచించకుండా రిసార్టులకు, హోటళ్లకు కూడా వెళ్తున్నారు. ఈ ఛాన్స్ ను మాయదారి కుర్రాళ్లు వాడేసుకుంటున్నారు.. ప్రత్యేకించి అబ్బాయిలతో బాగా తిరిగే అమ్మాయిలపై ఓ కన్నేసి.. వారిని ట్రాప్ చేస్తున్నారు. ఆ తర్వాత శీలంతో సహా సర్వం దోచుకుంటున్నారు.

ఇలాంటిదే ఘటన హర్యానాలో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ అమ్మాయి తన లవర్‌ తో కలసి రిసార్టుకు వెళ్లింది. అక్కడ ఆ యువతి అతడితో రొమాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేసింది. అయితే ప్రమాదం పోకిరీల రూపంలో పొంచి ఉంది. వీరి ఎంజాయ్‌ మెంట్‌ ను గమనించి కొందరు పోకిరి కుర్రాళ్లు ఆ దృశ్యాలన్నీ  వీడియో తీశారు. తాము చెప్పినట్టు వినకపోతే ఈ వీడియోలు మీ ఇంట్లో ఇస్తామని.. నెట్లో పెడతామని బెదిరించారు. బ్లాక్ మెయిల్ చేశారు.

దొరికింది కదా వీడియో అని.. తమ కోరిక తీర్చాలని ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. నలుగురు యువకులు.. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు.. అనేక సార్లు.. కానీ ఎన్నిసార్లు వాళ్ల దగ్గరకు వెళ్లినా అసలు వీడియోలు ఇవ్వకపోవడం.. పదే పదే పిలిపించుకుని అత్యాచారం చేయడంతో ఆమె విసిగిపోయి చివరకు పోలీసులకు కంప్లయింట్ చేసింది.

ఆ వీడియోను అడ్డం పెట్టుకుని అనేకసార్లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిపింది. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. ఆ యువతి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఓ యువకుడితో కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతోంది. అందుకే ఇలాంటి విషయాల్లో అమ్మాయిలు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.  బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి మరొకరి కోసం గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: