కరోనాతో చనిపోతే మాత్రం వాళ్ళు మనుషులు కాదా ? నడి రోడ్డు మీద కరోనా డెడ్ బాడీని అలా చేశారు..!

Kothuru Ram Kumar

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనుషులు పిట్టల్లా రాలిపోయి గుట్టల గుట్టలుగా శవాలు పెరుకుపోతున్నాయి. అయితే కరోనా తో మరణించిన వారి పట్ల వైద్యుల తీరు ఆవేదన కలిగిస్తోంది. కరోనా తో చనిపోవడంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు కూడా అప్పగించకుండా ఆస్పత్రి వారే వారి అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. అందరూ ఉండి కూడా అనాథ శవాలుగా వారి అంత్యక్రియలు జరుగుతున్నాయి. చాలా మంది కుటుంబ సభ్యులు తమ వారిని కూడా తీసుకెళ్లడానికి ముందుకురావడం లేదు. ఇటీవల కరోనా డెడ్ బాడీని శ్రీకాకుళం జిల్లాలో జేసీబీల్లో తరలిస్తే... కర్నాటకలో వైద్య సిబ్బంది మృతదేహాన్ని దారుణంగా ఈడ్చుకెళ్లారు.

 

 

{{RelevantDataTitle}}