ఈ మిస్ ఇండియా భామ నేటి కేంద్ర మంత్రి... ఆమె ఎవరో చెప్పుకోగలరా..?

Kothuru Ram Kumar

శుక్రవారం రోజు ప్రముఖ బుల్లితెర నిర్మాత ఏక్తా కపూర్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో 1998 లో మిస్ ఇండియా గా ఎంపిక కాబడిన ఒక యువతి మాట్లాడుతున్న వీడియో ని తన అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో అప్ లోడ్ అయిన కేవలం పది నిమిషాల్లోనే పెద్ద సంచలనం అయ్యింది. ఇంతకీ ఈ వీడియోలో ఉన్నది మరెవరో కాదు నేటి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ. గతంలో స్మృతి ఇరానీ టెలివిజన్ నటీమణి గా మోడల్ గా కొనసాగేవారు. 

 

 


అయితే ఏక్తాకపూర్ షేర్ చేసిన వీడియోలో 21 ఏళ్ల వయసు గల స్మృతి ఇరానీ మాట్లాడుతూ తనకు సాహస క్రీడలపై, ఆంగ్లభాష సాహిత్యం పై ఎక్కువ మక్కువ ఉన్నట్లు చెబుతారు. అప్పట్లోనే తనకు రాజకీయాల పై ఆసక్తి ఉందని వెల్లడించారు కూడా. ఈ వీడియో తో పాటు స్మృతి ఇరానీ స్నేహితురాలైన ఏక్తా కపూర్ ఆమె గురించి చాలా పొగిడారు. సాధారణ స్థాయి నుంచి టెలివిజన్ నటీమణిగా ఎదిగి మోడల్ గా దూసుకెళ్లి ఆపై రాజకీయాల్లో అరంగేట్రం చేసి శక్తివంతమైన, నిజాయితీపరురాలైన రాజకీయవేత్తగా ఎదిగిన నా స్నేహితురాలుని చూస్తుంటే స్ఫూర్తిదాయకంగా ఉందని ఆమె తెలిపారు. 

 


'వినయం తో పాటు ఆమె తన చరిత్రను మర్చిపోకుండా నడుచుకోవడమే ఆమెను అద్భుతమైన వ్యక్తిగా చేస్తుంది.  నా మిత్రమా మీ గురించి చాలా గర్వంగా ఉంది!' కపూర్ రాశారు.  ప్రస్తుతం నెటిజనులు ఏక్తాకపూర్ షేర్ చేసిన వీడియో కింద స్మృతి ఇరానీ ప్రస్తానాన్ని తెగ పొగుడుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హృతిక్ రోషన్ సతీమణి కూడా స్మృతి ఇరానీ పట్టుదలను డెడికేషన్ ను తెగ పొగిడారు.

 

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Appreciation Post for my friend

A post shared by Erk❤️rek (@ektarkapoor) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: