సీఎం జగన్ #1:  అవినీతి రహిత పాలన ...!

Kothuru Ram Kumar

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నేటితో సరిగ్గా సంవత్సరకాలం పూర్తయింది. ఈ సంవత్సరంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు తెర తీస్తూ వాటిని నడిపించారు. కేవలం పథకాల అమలు లోనే కాకుండా తన పాలనలోని ఒక కొత్త శైలి ప్రతి అడుగులో ఓ కొత్త ఒరవడిని సృష్టించారు.


వ్యవసాయం, విద్య, వైద్య, ఆరోగ్య రంగాలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ తో పోల్చిన సీఎం తను ఇచ్చిన హామీలను ఇప్పటికే 90 శాతం అమలు చేయడంలో రాష్ట్రంలో ప్రజల్లో అధిక శాతం హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా ఆయన పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేయడం ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపారు. 

 


ఇకపోతే జగన్ తన ప్రమాణస్వీకారం రోజు చెప్పినట్టుగానే అవినీతి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దుతానని అన్నట్లుగానే రాష్ట్రంలో అవినీతిని చాలావరకు కట్టడి చేయడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించారని చెప్పవచ్చు.

 

 

రోజుకు ఒక్క స్కామ్ అన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పని చేసే లాగా కాకుండా మొట్టమొదటి మీటింగ్ లోనే తన చెప్పినట్టుగా ఆ రోజుకి, ఈ రోజుకి అదే మాట మీద కట్టుబడి ఉంటాను అని జగన్ తెలిపిన సంఘటనలు ఎన్నో... ఇకపోతే ఒక జాతీయ మీడియా నిర్వహించిన జగన్ సంవత్సర పాలన పై 60 శాతం మంది ప్రజలు సుఖంగా ఉండగా, 40 శాతం మంది ప్రజలు విముఖంగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: