కాగా, నిత్యావసర వస్తువులు అమ్మే గ్రోసరీ స్టోర్స్ను మూసివేయడం వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని, అందుకే తెరచి ఉంచడానికి అంగీకరించాలని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) కోరుతోంది. నిత్యావసర సరుకుల దుకాణాలను మూసి వేస్తే ప్రజలు ఒకేసారి ఎక్కువ సరుకులు కొంటారని, తద్వారా కొరత ఏర్పడుతుందని కూడా పేర్కొంది. ప్రజలకు సేవలు అందించేందుకు రిటైల్ రంగంలోని ఉద్యోగులు తమ జీవితాలను పణంగా పెడుతున్నారని తెలిపింది. మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్