జగన్ పాలనలో స్త్రీ ఓ శక్తిగా మారిందా... లెక్కలే చెపుతున్నాయ్...!
ఇక అనకాపల్లి నుంచి సత్యవతి, అమలాపురం నుంచి చింతా అనూరాధ, అరకు నుంచి గొడ్డేటి మాధవి, కాకినాడ నుంచి వంగా గీత ఎంపీలు అయ్యారు. ఇక ఎంతో మంది మహిళలు తొలిసారి ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా ఎమ్మెల్యేలు అయ్యారు. విడదల రజనీ, ఉండవల్లి శ్రీదేవి, రెడ్డి శాంతి, జొన్నలగడ్డ పద్మావతి, ఉషాశ్రీ చరణ్ ఇలా చెప్పుకుంటే పోతే పుష్పశ్రీవాణి, సుచరిత, తానేటి వనిత లాంటి వాళ్లను జగన్ మంత్రులను చేశారు. తొమ్మిదినెలల పాలనలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ‘అమ్మ ఒడి’ వెలుగులు నింపింది. ‘జగనన్న వసతి దీవెన’ అమ్మలకు ఆసరాగా మారింది.
రాజకీయంగానూ మహిళలకు సింహభాగం దక్కింది. నామినేటెడ్ పనుల్లోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇక తెలంగాణలో దిశ హత్యాచారం, హత్య తర్వాత ఏపీలోనూ మహిళల భద్రత విషయంలో జగన్ కేర్ తీసుకున్నారు. ‘దిశ’ చట్టం మహిళలకు భద్రతనిచ్చింది. ఒక్క బటన్ నొక్కి దుండగుల భరతం పడుతున్నారు. దేశమంతా ఇపుడు మన ‘దిశ’ వైపే చూస్తోంది. ఇక మద్యం మహమ్మారి ప్రభావం తగ్గించారు. ఏదేమైనా జగన్ పాలనలో ఆమె శక్తి ఉధృతమవుతోంది.