దాంతో ఇంతకాలం ముఖ్యమంత్రులను చాలా చిన్ని చూపు చూస్తున్న నరేంద్రమోడి ఒక్కసారిగా తన పంథాను మార్చుకున్నట్లు సమాచారం. అందుకనే ఢిల్లీ ఫలితాల సరళిని గమనించిన వెంటనే జగన్మోహన్ రెడ్డికి కబురు పంపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫలితాల్లో ఎదురుదెబ్బ తప్పదని అర్ధమైపోయిన మోడి వెంటనే జగన్ కు అపాయిట్మెంట్ ఇచ్చి అమరావతి నుండి పిలిపించుకున్నట్లు సమాచారం.