కేజ్రీ గెలుపు: జగన్ గెలిచాడు... బాబు ఓడాడు... ఈ లెక్కేంటో చూడండి...!
ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఏపీ ఎన్నికల్లో జగన్ గెలుపుకు కీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రశాంత్ కిశోర్. ఎన్నికల వ్యూహకర్తగా తనదైన మార్క్ చూపించిన పీకే, జగన్ గెలుపు కోసం సర్వ శక్తులు ఒడ్డాడు. ముఖ్యంగా సోషల్ మీడియా, ప్రచారం విషయంలో పీకే సలహాలు జగన్ గెలుపులో కీలక పాత్ర వహించాయనటంలో సందేహం లేదు. ఇదే ప్రశాంత్ కిశోర్ ఢిల్లీలోనూ ఆప్ తరువాత బరిలో దిగటంతో అది కూడా కేజ్రీవాల్కు కలిసోచ్చింది. అయితే ఆప్ కోసం పీకే పనిచేసింది రెండు మాసాలే అయినా తనవంతుగా కేజ్రీవాల్కు అధికారం కట్టబెట్టడంలో సాయం చేశాడు. దీన్నిబట్టి చూస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఉన్న స్నేహం వైరం అనేది రాష్ట్రాల్లో పార్టీల మీద పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.