ఈనెల 22 వ తేదీన తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.  అయితే, ప్రధానంగా తెరాస, కాంగ్రెస్, బీజేపీ ల మధ్య పోటీ రసవత్తరంగా సాగబోతున్నది. ఎలాగైనా సరే విజయం సాధించాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి.  పార్టీలు బలంగా ఉన్న అన్ని చోట్ల అభ్యర్థులకు టికెట్స్ ఇచ్చారు.  అయితే, ఖచ్చితంగా గెలుస్తామని ధీమా ఉన్న వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారు.  ఎందుకంటే, ఇప్పుడు అన్ని పార్టీల్లో కూడా రెబల్స్ అభ్యర్థులు బరిలో ఉన్నారు.